మద్యం మత్తులో యువత చిత్తవుతున్నది. చిన్న వయసులోనే భర్త దూరమైన వారెందరో! తాగు… ఊగు… జోగు… సావు అన్నట్టు గత ప్రభుత్వ హయాంలో సాగింది. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తదో! మద్యాన్ని ఎలా అరికడుతుందో వేచి చూడాల్సి ఉన్నది. మత్తు పదార్థాల వినియోగాన్ని పోనుపోను నిరుత్సాహపరుస్తూ, ఆరోగ్యభారతానికి బాటలు పరవడం పాలకుల విధ్యుక్తధర్మంగా 47వ రాజ్యాంగ అధికరణ నిర్దేశిస్తోంది. దాన్ని తుంగలో తొక్కుతూ ఊరూవాడా మద్యపుటేర్లను గత ప్రభుత్వం పారించింది. సర్కారీ విధానాలతో సామాజిక సంక్షోభం కమ్ముకుంటోంది. ఇంటి పెద్దల తాగుడు వ్యసనం. దేశవ్యాప్తంగా లక్షల కుటుంబాలను పేదరికంలోకి నెట్టి… దరిద్రపు ఊబిలోకి నెట్టుకుపోతోంది. తండ్రుల హఠాన్మరణంతో కుటుంబ పోషణ భారాన్ని తలకెత్తుకుంటున్న పిల్లలు అనివార్యంగా దూరమవుతున్నారు. వారిలో అత్యధికులు క్రమేణా మత్తుకు బానిసలుగా బానిసలుగా మారి చదువులకు దూరమవుతున్నారు . పరిధులు దాటిన సురాసేవనంతో తీవ్ర అనారోగ్యం పాలై కట్టుకున్న భార్యలు, కడుపున పుట్టిన బిడ్డలను అనాథలుగా మిగిల్చి యుక్తవయసులోనే కన్నుమూస్తున్నారు. మద్యం కారణంగా ఇండియాలో సంవత్సరానికి 2.60 లక్షల ప్రాణాలు అర్ధాంతరంగా కడతేరిపోతున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ 2018లో ప్రకటించింది. ఆ మహమ్మారితో వచ్చే రోగాలు, దాని మూలంగా చోటుచేసుకునే రహదారి ప్రమాదాలు, ఆత్మహత్యలు వంటివాటితో భారతదేశంలో ఏటా అయిదు లక్షల మందికి పైగా అసువులు బాస్తున్నారని అంతర్జాతీయ వ్యాధిభార (జీబీడీఆర్) నివేదిక లోగడ లెక్కకట్టింది. సమాజ శ్రేయస్సుకు హానికరమైన మద్యం క్రయవిక్రయాలు నూరుశాతం అర్హమైనవని సుప్రీంకోర్టు గతంలోనే స్పష్టంచేసింది. ఆ హితోక్తిని పెడచెవిన పెడుతూ ప్రత్యేక విధానాలు, సృజనాత్మక పద్ధతులతో ఆ అనైతిక వ్యాపారాన్ని జోరుగా ప్రోత్సహిస్తున్న రాష్ట్ర ప్రభుత్వాలు- సంక్షేమ రాజ్యభావనకు సమాధి కడుతున్నాయి.
పూర్తిగా చదవండి..Revanth Reddy: మద్యం మత్తు వదల్చాలి రేవంత్సర్కారు!
బీఆర్ఎస్ పాలనలో గల్లీ గల్లీకి వైన్స్, బెల్ట్ షాపులు తెరిచి ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నరని మహిళలు ఆనాడు మండిపడ్డారు. మరి రేవంత్రెడ్డి దీనికి చెక్ పెడతారా? ఈ విషయంపై తెలంగాణ లోక్ సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మన్నారం నాగరాజు అందించే విశ్లేషణ కోసం ఆర్టికల్ మొత్తం చదవండి.
Translate this News: