ఆ డెడ్ బాడీలు ఎవరిని? వాటిని తీసుకోవడానికి ఎవరూ రారేంటి..? మణిపూర్(manipur) శవాగారాల్లో పడి ఉన్న మృతదేహాలపై అనేక అనుమానాలు నెలకొని ఉన్నాయి. మణిపూర్లో ముగ్గురు మహిళలను వివస్త్రలుగా చేసి ఊరేగించిన ఘటనపై సుప్రీంకోర్టు(supreme court) విచారిస్తుండగా.. ఈ డెడ్బాడీల అంశంపై కేంద్రం చెప్పిన సమాధానం తీవ్ర చర్చనీయాంశమవుతోంది. శవాగారాల్లో పడి ఉన్న మృతదేహాలు చొరబాటుదారులవని సుప్రీంకోర్టుకు కేంద్రం చెప్పింది. కేంద్రం, మణిపూర్ రాష్ట్ర ప్రభుత్వం రెండింటికీ ప్రాతినిధ్యం వహిస్తున్న సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా(Tushar mehta) సుప్రీంకోర్టుకు ఈ విషయాన్ని తెలిపారు. ఆ మృతదేహాలన్ని చొరబాటుదారులవేనని.. దాని గురించి ఇంతకంటే ఎక్కువ మాట్లాడలేనన్నారు తుషార్ మెహతా.
పూర్తిగా చదవండి..మణిపూర్ శవాగారాల్లో పడివున్న మృతదేహాలు చొరబాటుదారులవి..కేంద్రం చెప్పిన సమాధానంపై సుప్రీంకోర్టు రియాక్షన్ ఏంటంటే..?
మణిపూర్ అల్లర్లలో వందలాది మంది చనిపోగా.. వాటిలో 118మంది మృతదేహాలు ఇంకా శవాగారాల్లోనే పడి ఉండడంపై కేంద్రాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. కేంద్రం, మణిపూర్ తరుఫున వాదిస్తున్న సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సుప్రీంకోర్టుకు ఈ విషయంపై చెప్పిన సమాధానంపై భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. మృతదేహాలు చొరబాటుదారులవని మెహతా సుప్రీంకోర్టుకు చెప్పడంపై విపక్షాలు మండిపడుతున్నాయి. చొరబాటుదారులు దేశంలోకి అక్రమంగా ప్రవేశిస్తుంది కేంద్రం ఏం చేస్తుందని ప్రశ్నిస్తున్నారు.
Translate this News: