VN Adithya : 'మనసంతా నువ్వే' డైరెక్టర్ కొత్త సినిమా.. డల్లాస్ లో ఆడిషన్స్ కి విశేష స్పందన!

వీఎన్‌ ఆదిత్య దర్శకత్వంలో మరో కొత్త సినిమా రాబోతుంది. అయితే సినిమాకు సంబంధించి తాజాగా ఓఎంజీ ప్రొడక్షన్‌ హౌస్‌ ఆడిషన్స్‌ నిర్వహించింది. ఈ ఆడిషన్స్‌ లో ప్రవాస భారతీయులు మాత్రమే కాక విదేశీయులు సైతం భారీ సంఖ్యలో పాల్గొన్నారు. దీనిపై దర్శకుడు వీఎన్‌ ఆదిత్య తన హర్షం వ్యక్తం చేశారు.

New Update
VN Adithya : 'మనసంతా నువ్వే' డైరెక్టర్ కొత్త సినిమా.. డల్లాస్ లో ఆడిషన్స్ కి విశేష స్పందన!

VN Adithya New Movie Auditions : టాలీవుడ్ లో ఒకప్పుడు ఫీల్ గుడ్ లవ్ స్టోరీస్ కమర్షియల్ ఫ్యామిలీ మూవీస్ తో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు వి.ఎన్ ఆదిత్య. మనసంతా నువ్వే, శ్రీరామ్, నేనున్నాను.. వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. గత కొంతకాలంగా ఆయన కొన్ని సినిమాలను డైరెక్ట్ చేయగా.. అవి ఇంకా విడుదల కావాల్సి ఉన్నాయి. ఇక తాజాగా ఆయన సినిమాలకు సంబంధించి ఓ సరికొత్త అప్డేట్ వచ్చింది. త్వరలోనే విఎన్ ఆదిత్య దర్శకత్వంలో ఓ మూవీ రాబోతుంది. ఓ ఎం జి ప్రొడక్షన్స్ అనే కొత్త నిర్మాణ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది.

ఇందుకు సంబంధించి జూలై 7న అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలోని డల్లాస్ లో లాకింటా బంకేట్ హాల్లో అధికారిక ప్రకటన చేశారు. విఎన్ ఆదిత్య దర్శకత్వంలో వచ్చే కొత్త సినిమా నిర్మాణం డల్లాస్ లో జరగనుందని, త్వరలోనే సెట్స్ పైకి వెళ్తుందని ఈ సందర్భంగా తెలిపారు. అయితే తాజాగా ఈ మూవీ నిర్మాణ సంస్థ ఆడిషన్స్ నిర్వహించింది. ఇందులో మన ఇండియన్స్ మాత్రమే కాకుండా అమెరికన్స్, స్పానిష్ పీపుల్, ఆఫ్రికన్స్, యూరోపియన్స్, ఏషియన్స్ వంటి ఫారినర్స్ పాల్గొన్నారు. వీరితోపాటు ముఖ్యంగా తమిళ్, కన్నడ, తెలుగు వాళ్ళు భారీ సంఖ్యలో సినిమాలో నటించేందుకు ఆసక్తి చూపుతూ ఆడిషన్స్ లో పాల్గొన్నారు.

Also Read : రవితేజ – భాగ్య శ్రీ డ్యూయెట్.. ట్యూన్ అదిరిపోయిందిగా..!

ఈ రెస్పాన్స్ పై డైరెక్టర్ ఆదిత్య హర్షం వ్యక్తం చేశారు. దేశం కానీ దేశంలో ఓ తెలుగు సినిమా ఆడియన్స్ కి ఇంతటి ఆదరణ రావడం నిజంగా విశేషమనే చెప్పాలి.ఈ కార్యక్రమం ఇంత విజయవంతంగా జరగడానికి సహకరించిన డాలస్ మూవీ బఫ్స్ వాట్సప్ గ్రూప్ కి, డాలస్ ప్రొడ్యూసర్స్ వాట్సప్ గ్రూప్ కి, ఫేస్ బుక్ పేజెస్ ఎడ్మిన్స్ కి , శ్రీమతి సజిత నాయుడు తిరుమల శెట్టి కి, రష్మికి, వరుణ్ కి, జీషన్ కి, శ్యామ్ కట్రు, కమల్ నందికొండ, వరుణ్, కార్తీక్ అనిపిండి, డా.ఇస్మైల్ గారికి, శ్రీనివాస్ కల్లూరి, గోవర్ధన్, కిషన్ గార్లకి, లాకింటా హోటల్ మేనేజ్మెంట్ అండ్ స్టాఫ్ కి, మీడియా ఇన్ చార్జ్ మమతా కాసం గారికి, తన వ్యాఖ్యానం తో అందరినీ అలరించిన కుమారి సంహిత అనిపిండి కి, నిర్మాతలు డా. మీనాక్షి అనిపిండి, శ్రీ శాస్త్రి అనిపిండి మనస్పూర్తిగా ధన్యవాదాలు తెలిపారు.

Advertisment
తాజా కథనాలు