ప్రజలకు హామీలిచ్చి మాట తప్పడం, అవసరం తీరాక మోసం చేయడం కేసీఆర్ లక్షణమని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఆరోపించారు. కాంగ్రెస్ బస్సు యాత్రలో ఆదివారం నాడు ఖర్గే పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంగారెడ్డి, మెదక్లలో మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సందర్భంగా కేసీఆర్ సోనియాగాంధీకి మాట ఇచ్చి తప్పిన విషయం మొత్తం తెలంగాణ ప్రజలకు తెలుసని.. కానీ సోనియాగాంధీ మాత్రం ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంతో విడదీయలేని అనుబంధం ఇందిరమ్మకు సొంతం అని ఖర్గే అన్నారు. సంగారెడ్డిలో ఇందిరా గాంధీ కాలు మోపి యావత్ దేశంలో కాంగ్రెస్ పార్టీకి జీవం పోశారన్నారు. మెదక్ నుంచి ఎంపీగా గెలిచి దేశానికి ఆమె ప్రధానమంత్రి అయ్యారన్నారు. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ పేదల కోసం చేసిన పని దేశంలో మరెవరూ చేయలేరన్నారు. కాంగ్రెస్ పార్టీలో హైదరాబాద్లో ఎన్నో జాతీయ సంస్థలు నెలకొల్పిందని, వాటితో ఎంతో మందికి ఉద్యోగ అవకాశాలు లభించాయని మల్లికార్జున ఖర్గే అన్నారు. గతంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలను తప్పక నెరవేర్చిందని, ఇప్పుడు ఇచ్చిన 6 గ్యారెంటీలను కూడా తప్పకుండా అమలు చేసి తీరుతుందన్నారు. రైతులకు రైతు భరోసా కింద ఎకరానికి రూ.15 వేలు ఇస్తామని మాట ఇచ్చారు. 200 యూనిట్ల వరకు ఉచితంగా కరెంటు ఇస్తామని హామీ ఇచ్చారు. మహిళలకు ప్రతి నెల వారి ఖాతాల్లో రూ.2500 వేస్తామని మల్లికార్జున్ ఖర్గే హామీ ఇచ్చారు. వరికి మద్దతు ధరతో పాటు అదనంగా మరో రూ.500 బోనస్ ఇస్తామన్నారు. విద్యార్థులకు యువ వికాసం కింద చదువులు కోసం రూ.5 లక్షలు ఇస్తామని స్పష్టం చేశారు.
ఇది కూడా చదవండి: Telangana: ‘అన్నా ఇటు వచ్చేయ్’.. నాగం జనార్థన్ రెడ్డికి కేటీఆర్ బంపర్ ఆఫర్..!
TS Elections 2023: కేసీఆర్ నైజం అదే.. మల్లికార్జున్ ఖర్గే సంచలన ఆరోపణలు
తెలంగాణను సీఎం కేసీఆర్ అప్పుల పాలు చేశారని ఏఐసీసీ చీఫ్ మల్లిఖార్జున్ ఖర్గే ధ్వజమెత్తారు. అవసరాలకు హామీ ఇచ్చి తర్వాత మోసం చేయడం కేసీఆర్ కు అలవాటేనని ఆరోపించారు. సంగారెడ్డి, మెదక్లో ఈ రోజు జరిగిన కాంగ్రెస్ బస్సు యాత్రలో ఆయన పాల్గొన్నారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని ఈ ఎన్నికల్లో గెలిపించాలని ఓటర్లను కోరారు.
Translate this News: