మహారాష్ట్రలోని విదర్భ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గత 10 రోజుల్లో 19 మంది ప్రాణాలు కోల్పోయారు. అదే సమయంలో, 4,500 పైగా ఇళ్లు ధ్వంసమయ్యాయి. 54,000 హెక్టార్లలో పంటలు కూడా దెబ్బతిన్నాయి. మరోవైపు గుజరాత్ కూడా వరదలతో అల్లాడిపోతోంది. ఆదివారం (జూలై 23) ఉదయం 241 మిల్లీమీటర్ల వర్షం కురవడంతో జునాగఢ్ అన్ని చోట్లా జలమయమైంది. 3000 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మరోవైపు అహ్మదాబాద్లోని సర్దార్ వల్లభాయ్ ఎయిర్పోర్ట్లో రన్వే నుంచి పార్కింగ్ వరకు ఎక్కడ చూసినా నీరే కనిపించింది.
పూర్తిగా చదవండి..ఈ రెండు రాష్ట్రాల్లో వరద బీభత్సం… విదర్భలో 19 మంది మృతి..!!
మహారాష్ట్రలోని విదర్భ ప్రాంతం గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో అతలాకుతలం అవుతోంది. ఆదివారం (జూలై 23) ఉదయం 8.30 గంటల వరకు గడిచిన 24 గంటల్లో అకోలాలో 107.9 మిల్లీమీటర్ల వర్షం నమోదైందని వాతావరణ కేంద్రం తెలిపింది. విదర్భలోని అమరావతి డివిజన్పై వర్షాల ప్రభావం ఎక్కువగా ఉంది. భారీ వర్షాల కారణంగా తలెత్తే పరిస్థితులను ఎదుర్కోవడానికి రాష్ట్రం పూర్తిగా సిద్ధంగా ఉందని మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తెలిపారు. అటు గుజరాత్ కూడా భారీ వర్షాలతో ఉక్కిరిబిక్కిరి అవుతోంది. పంజాబ్ లో వరద నీరు ఇళ్లలోకి వచ్చి చేరింది.
Translate this News: