TG: అత్తమామల ఆస్తిపై కన్నేసిన భర్త.. అందుకు ఒప్పుకోలేదని భార్యను ఏం చేశాడంటే..!

మహబూబ్​నగర్​ జిల్లా కిష్టారం గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. అత్తమామల ఆస్తి పంపకాల్లో వాటాకు ఒప్పుకోవడం లేదని భార్యను భర్త గొంతు నులిమి హత్య చేశాడు. డెడ్​బాడీని డంపింగ్​ యార్డులో పడేసి మిస్సయిందని పోలీసులకు కంప్లైంట్ ఇచ్చాడు.​ కూతురు ఫిర్యాదుతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

New Update
TG: అత్తమామల ఆస్తిపై కన్నేసిన భర్త.. అందుకు ఒప్పుకోలేదని భార్యను ఏం చేశాడంటే..!

Mahabubnagar: అత్తమామల ఆస్తిపై అల్లుడు కన్నేశాడు. ఆస్తి పంపకాల్లో వాటాకు ఒప్పుకోవాలని తన భార్యను అడిగిచూశాడు. అయితే, భార్య మాత్రం అందుకు ఒప్పుకోలేదు. దీంతో భార్యను దారుణంగా హత్య చేశాడు ఓ భర్త. అనంతరం డెడ్​బాడీని డంపింగ్ ​యార్డులో పడేసి తనకేమీ తెలియదనట్లుగా పోలీసులకు తన భార్య మిస్సయిందని కంప్లయింట్ ఇచ్చాడు. కానీ,​ కూతురు ఫిర్యాదుతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. భర్తే తన భార్యను చంపేసినట్లు విచారణలో ఒప్పుకున్నాడు. వివరాల్లోకి వెళితే..

వాటా తీసుకోవాలని..

మహబూబ్​నగర్​ జిల్లా జడ్చర్ల మండలం కిష్టారం గ్రామానికి బియని అనిత అనే మహిళకు చెల్లె, ఇద్దరు తమ్ముళ్లున్నారు. ఓ తమ్ముడికి అనిత తన పెద్ద బిడ్డ శ్వేతను ఇచ్చి పెండ్లి చేసింది. తల్లిదండ్రుల ఆస్తిని అనిత తన చెల్లెతో పాటు మరో ఇద్దరు తమ్ముళ్లు పంచింది కానీ ఆమె వాటా తీసుకులోదు. ఈ విషయంలో తనకు ఏ మాత్రం అభ్యంతరం లేదని అనిత తేల్చి చెప్పింది. అయితే, అనిత భర్త జంగిరెడ్డి మాత్రం అభ్యంతరం వ్యక్తం చేశాడు. ఆస్తి పంపకాల్లో వాటా తీసుకోవాలని భార్యపై ఒత్తిడి తెచ్చాడు. అనిత మాత్రం అందుకు ఒప్పుకోలేదు.

చంపేందుకు ప్లాన్..

పంచాయితీ పెట్టించి భార్య అనిత ఫ్యామిలీ ప్రాపర్టీలో తనకు వాటా ఇవ్వాల్సిందేనని పట్టుబట్టాడు. దీనికి అనిత సపోర్ట్ ​చేయకపోవడంతో జంగిరెడ్డి తన భార్యపై కోపం పెంచుకున్నాడు. ఎంత చెప్పినా మాట వినడం లేదని ఇక అనితను చంపేందుకు స్కెచ్ చేశాడు. ఈ నెల16న గంగాపూర్​ చెన్నకేశవస్వామి టెంపుల్​కు భార్య అనితను వెంటబెట్టుకు వెళ్లాడు. తిరిగి వచ్చేటప్పుడు పోలేపల్లి శివారులోని లెదర్​పార్క్ ​సమీపంలో ఓ గుంత వద్దకు తీసుకెళ్లాడు. అక్కడే ఉన్న వైరుతో భార్య గొంతుకు బిగించి ఆమెను హత్య చేయబోయాడు. అయితే, స్థానిక కుక్కలు అరుస్తూ వెంటపడడంతో చంపే ప్లాన్ విరమించుకున్నాడు.

Also Read: దారుణం.. జువైనల్ హోమ్‌లో ఉండే బాలికపై అత్యాచారం.!

వైరుని గొంతుకు చుట్టి

ఈ విషయాన్ని భార్య అనిత తన పెద్ద కూతురు శ్వేతకు ఫోన్ ​చేసి చెప్పగా వెంటనే తండ్రి జంగిరెడ్డిని ఆమె ప్రశ్నించింది. దీంతో  జోక్​ చేసిన బిడ్డా..నేను మీ అమ్మను ఎందుకు చంపుతాన్రా అని బుకాయించాడు. అయితే, మరుసటి రోజు జంగిరెడ్డి భార్య అనితను పోలేపల్లి లెదర్​పార్క్ ​సమీపంలోకి తీసుకువెళ్లి అక్కడే ఉన్న వైరుని తీసుకొని గొంతుకు బిగించి నులిమి చంపేశాడు. అనంతరం అనిత డెడ్​బాడీని స్థానిక డంపింగ్ ​యార్డులో పడేశాడు.

కూతురు ఫిర్యాదుతో..

తర్వాత ఇంటికి వచ్చి అనితను కూతురు శ్వేత వద్దకు వెళ్లమని చెప్పానని తెలిపాడు. అనంతరం భార్య కనిపించడం లేదని ఈ నెల 20న పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే, బిడ్డ శ్వేతకు తండ్రిపై అనుమానం వచ్చి పోలీసులకు కంప్లయింట్ చేసింది. తండ్రి జంగిరెడ్డిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేపట్టగా నేరం ఒప్పుకున్నాడు. డంపింగ్ ​యార్డులోని డెడ్​బాడీని వెలికితీసి పోస్ట్​మార్టం కోసం జడ్చర్ల ఆసుపత్రి తరలించామని టౌన్​ సీఐ ఆదిరెడ్డి చెప్పారు.

Advertisment
తాజా కథనాలు