Raksha Bandhan 2024: అయ్యో.. తమ్ముడికి రాఖీ కట్టి ప్రాణం విడిచిన అక్క!

రాఖీ పౌర్ణమి వేళ మహబూబాబాద్ జిల్లాలో పెను విషాదం చోటు చేసుకుంది. ఆకతాయిల వేధింపులతో పురుగుల మందు తాగిన ఓ అక్క ప్రాణాపాయ స్థితిలో ఉండి కూడా తమ్ముడికి రాఖీ కట్టింది. అనంతరం గంటల వ్యవధిలోనే కన్నుమూసింది. ఈ ఘటన స్థానికంగా అందరికీ కన్నీరు పెట్టిస్తోంది.

New Update
Raksha Bandhan 2024: అయ్యో.. తమ్ముడికి రాఖీ కట్టి ప్రాణం విడిచిన అక్క!

Mahabubabad:  ఇంట్లో ఎంత కొట్టుకున్నా.. తిట్టుకున్నా కష్టం అని చెప్పగానే ముందుండేది తోబుట్టువులు. తల్లిదండ్రుల తర్వాత ఆడపిల్లలు అంతగా ప్రేమించేది తోబుట్టువులను మాత్రమే. వారికీ ఏదైనా కష్టం వచ్చినా, అపాయం జరిగిన క్షణం కూడా తట్టుకోలేరు అంతలా వారి పై ప్రేమను పెంచుకుంటారు. చరిత్రలో చావు తప్పా ఎవరూ విడదీయలేని బంధం అన్నాచెల్లెళ్ళ అనుబంధం. అలాంటి తోబుట్టువుల అనుబంధానికి ప్రతీకగా జరుపుకునే పండగే రక్షాబంధన్. ఈ పండగ రోజున అక్కాచెల్లి ఎంత దూరంలో ఉన్నా, ఎన్ని ఇబ్బందుల్లో ఉన్నా తోబుట్టువులకు రాఖీ కట్టడానికి వస్తారు.

మహబూబాబాద్ జిల్లాలో ఓ అక్క చివరి శ్వాస వరకు కూడా తన తమ్ముడికి రాఖీ కట్టాలని పరితపించిన తీరు అందరికీ కంటతడి పెట్టిస్తోంది. తమ్ముడికి రాఖీ కట్టడానికి తన శక్తినంతా కూడదీసుకున్న ఆ అక్క.. రాఖీ కట్టి తమ్ముడిని ఆశీర్వదించిన కొద్ది సేపటికే ప్రాణాలు విడిచింది. ఆ ఘటన అందరినీ కలచివేస్తోంది. ఈ వార్త, ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.

వివరాల్లోకి వెళ్తే..
కోదాడలో డిప్లొమా చదువుతున్న ఓ యువతిని ప్రేమ పేరుతో ఆకతాయిలు వేధింపులకు గురిచేశారు. అది తట్టుకోలేకపోయిన యువతి గడ్డి మందు తాగి ఆత్మహత్యయత్నం చేసింది. ఆ తర్వాత ఆసుపత్రిలో కొన ఊపిరితో పోరాడుతున్న ఆ అమ్మాయి.. రాఖీ పండగ నాటికి ప్రాణాలతో ఉంటానో లేదో అన్న బాధతో శనివారం రాత్రి సోదరులకు రాఖీ కట్టి గంటల వ్యవధిలోనే ప్రాణాలు విడిచింది.

Also Read: Raksha Bandhan : హిట్లర్, ఒరేయ్ రిక్షా, రాఖీ.. తెలుగులో సిస్టర్ సెంటిమెంట్ తో వచ్చిన సినిమాలివే! - Rtvlive.com

Advertisment
తాజా కథనాలు