Hindu Temples : పిక్నిక్‌ స్పాట్స్‌ కావు.. దేవాలయాల్లో వాళ్లకి ప్రవేశం నిషేధమంటూ కోర్టు సంచలన తీర్పు!

రాతపూర్వక హామీ లేకుండా హిందువులు కానివారిని ఆలయం లోపలికి అనుమతించకూడదంటూ మద్రాసు హైకోర్టు తీర్పునిచ్చింది. ధ్వజస్థంభం దాటి ఆలయ ప్రాంగణం లోపల 'హిందువులు కానివారిని అనుమతించడం లేదు'అని సూచించే బోర్డులను ఏర్పాటు చేయాలని కోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది.

New Update
Hindu Temples : పిక్నిక్‌ స్పాట్స్‌ కావు.. దేవాలయాల్లో వాళ్లకి ప్రవేశం నిషేధమంటూ కోర్టు సంచలన తీర్పు!

Madras High Court Judgement on Temple Entry : తమిళనాడు(Tamilnadu) లోని పళని దేవాలయం కేసులో మద్రాసు హైకోర్టు(Madras High Court) సంచలన తీర్పునిచ్చింది. ధ్వజస్థంభం దాటి హిందువులు కానివారిని అనుమతించరాదని మద్రాసు హైకోర్టు పేర్కొంది. ఆలయ ప్రవేశ ద్వారం వద్ద బోర్డు పెట్టాలని ఆదేశించింది. రాష్ట్ర ప్రభుత్వానికి సూచనలతో పాటు ఆలయానికి సంబంధించిన అధికారులకు కూడా కోర్టు ఈ ఆదేశాలను ఇచ్చింది. ఆచారాలు, పద్ధతుల ప్రకారం ఆలయాన్ని నిర్వహించాలని కోర్టు పేర్కొంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 15 కిందకి ఆలయాలు రావని హైకోర్టు పేర్కొంది. అలాంటి పరిస్థితిలో, హిందుయేతరుల ప్రవేశంపై విధించిన నిషేధాన్ని అన్యాయంగా పరిగణించలేమని చెప్పుకొచ్చింది.

పిక్నిక్ ప్లేస్ కాదు:
ఆలయద్వారం వద్ద ఉన్న ధ్వజస్తంభం దగ్గర ‘ధ్వజస్తంభం దాటి హిందువులు కాని వారిని లోపలికి రానివ్వరు’ అని బోర్డు పెట్టాలని కోర్టు పేర్కొంది. తమిళనాడు హైకోర్టు మధురై బెంచ్‌లో జస్టిస్ ఎస్ శ్రీమతి(Justice S Srimathy) ఈ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఆలయం బయటి వ్యక్తులు లేదా ఇతర మతాల వారు వెళ్లే పిక్నిక్ ప్లేస్ కాదన్నారు. ఈ ఉత్తర్వుకు ముందు, దేవస్థానం యథాతథ స్థితిని కొనసాగించాలని ఆదేశించింది. ఆలయ ఉత్సవాల సందర్భంగా తొలగించిన డిస్‌ప్లే బోర్డులను మళ్లీ అమర్చాలని అధికారులను కోర్టు ఆదేశించింది.

Also Read : కుమారీ ఆంటీకి రేవంత్‌ గుడ్‌ న్యూస్‌.. స్ట్రీట్‌ ఫుడ్‌ రీఒపెన్‌..

రిజిస్ట్రేషన్‌ తప్పనిసరి:
పళనికి చెందిన సెంథిల్‌కుమార్‌ కోర్టులో పిటిషన్‌ వేశారు. ఆలయ నోటీసు బోర్డును తొలగించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆలయంలోకి హిందువులు(Hindu's) కానివారిని నిషేధించాలని బోర్డుపై రాసి ఉన్న సందేశంతో పాటు నోటీసు బోర్డును పునరుద్ధరించేలా ఆదేశించాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. విచారణ అనంతరం, హిందూయేతరులు, హిందూ విశ్వాసాలను పాటించని వ్యక్తులు ఆలయ ప్రాంగణంలోకి ప్రవేశించడంపై నిషేధాన్ని బలపరిచే బ్యానర్‌ను మళ్లీ అమర్చాలని జస్టిస్ శ్రీమతితో కూడిన సింగిల్ జడ్జి బెంచ్ ఆదేశించింది. ధ్వజస్తంభం వరకు మాత్రమే వారికి పరిమితి వర్తిస్తుందని తెలిపింది. దర్శనానికి ముందు హిందువులు కానివారు తమ పేర్లను నమోదు చేసుకోవాలని చెప్పింది. ఆలయాన్ని సందర్శించాలనే ఉద్దేశ్యాన్ని తెలిపిన తర్వాతే ఆలయ ప్రవేశానికి అనుమతి లభిస్తుందని కోర్టు తెలిపింది. ‘ఆలయ నియమాలు, ఆచారాలు, ఆలయ అభ్యాసాలను ఖచ్చితంగా పాటించడం ద్వారా ఆలయ ప్రాంగణాన్ని నిర్వహించాలి’ అని జడ్జి చెప్పారు. ఇక ఆలయ ప్రవేశ అనుమతి చట్టం, 1947 దేవాలయాల్లోకి ప్రవేశం కల్పించేటప్పుడు హిందూ సమాజంలో ఉన్న వివక్షను తొలగించడానికి తీసుకున్న చొరవ అని కోర్టు నొక్కి చెప్పింది. ఇది హిందువులు కాని వారిని కూడా ఆలయంలోకి అనుమతించడానికి సంబంధించిన చట్టం కాదు.

Also Read: గుడ్ న్యూస్.. మెగా డీఎస్సీకి ఏపీ కేబినెట్ ఆమోదం!

WATCH:

Advertisment
తాజా కథనాలు