Love Cheating: కరీంనగర్ లో ప్రేమ కిలాడి.. రూ.16 లక్షలతో జంప్! ఓయువకుడిని ప్రేమించినట్లు నమ్మించి.. పెళ్లి బంగారం కోసమంటూ రూ.16 లక్షలు తీసుకుని జంప్ అయిన ఘటన కరీంనగర్ లో చోటు చేసుకుంది. ప్రియురాలు మోసం చేయడంతో బాధిత యువకుడు నాగరాజు ఆత్మహత్యకు యత్నించాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. By Nikhil 18 May 2024 in క్రైం టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి ప్రేమ పేరుతో యువకుడిని ఓ కిలాడి మోసం చేసిన ఘటన కరీంనగర్ జిల్లాలో సంచలనంగా మారింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. విశాఖకు చెందిన ప్రియాంకతో కరీంనగర్కు చెందిన నాగారాజుకు తమిళనాడు ఈషా ఫౌండేషన్లో పరిచయం ఏర్పడింది. దీంతో కొన్నేళ్లుగా ఇద్దరూ సహజీవనం చేశారు. అనంతరం పెళ్లి కోసం బంగారం కొనాలంటూ యువకుడి వద్ద నుంచి రూ.16 లక్షలు తీసుకున్న సదరు యువతి పరార్ అయ్యింది. ఆ యువతి ఆస్ట్రేలియాకు జంప్ అయినట్లు తెలుస్తోంది. దీంతో ప్రియురాలు మోసం చేసిందనే మనస్తాపంతో నాగరాజు ఆత్మహత్యాయత్నానికి పాల్పడడంతో.. ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఇప్పుడు ఆ యువతిని ఫోన్ ద్వారా సంప్రదిస్తే.. తనకు మరో రూ.3 లక్షలు ఇవ్వాలని.. తన పేరిట 2 ఎకరాలు రిజిస్ట్రేషన్ చేస్తేనే నాగరాజును పెళ్లి చేసుకుంటానని కండిషన్లు పెడుతుందని నాగరాజు కుటుంబ సభ్యులు, సన్నిహితులు చెబుతున్నారు. దీంతో నాగరాజు, అతని తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమకు న్యాయం చేయాలని నాగరాజు తల్లిదండ్రులు కన్నీటి పర్యంతం అవుతున్నారు. తండ్రి ఫిర్యాదు మేరకు ప్రియాంకపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. #NULL మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి