మెదక్ కాంగ్రెస్ లో మంటలు.. మంత్రి కొండా సురేఖ ముందే తీవ్ర వ్యాఖ్యలు!

మెదక్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి నీలం మధుపై పటాన్ చెరు కాంగ్రెస్ నేత కాట శ్రీనివాస్ గౌడ్ సతీమణి తీవ్ర వ్యఖ్యలు చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో నీలం మధు తన భర్తను ఎన్నో మాటలు అన్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. నీలం మధు చెంప పగలగొట్టాలనుకున్నానని షాకింగ్ కామెంట్స్ చేశారు.

New Update
మెదక్ కాంగ్రెస్ లో మంటలు.. మంత్రి కొండా సురేఖ ముందే తీవ్ర వ్యాఖ్యలు!

బీఆర్ఎస్ కంచుకోటగా చెప్పబడే మెదక్ ఎంపీ సీటుపై కాంగ్రెస్ జెండా ఎగురవేయాలని భావిస్తున్న రేవంత్ రెడ్డికి అంతర్గత కుమ్ములాటలు తలనొప్పిగా మారాయి. ముఖ్యంగా పటాన్ చెరు నుంచి పోటీ చేసి ఓటమి పాలైన కాట శ్రీనివాస్ గౌడ్ నుంచి ఎంపీ అభ్యర్థి నీలం మధుకు సహకారం అందడం లేదు. మంత్రి కొండా సురేఖ ఎదుటనే కాట శ్రీనివాస్‌గౌడ్‌ భార్య సుధారాణి తన అసంతృప్తిని వ్యక్తం చేశారు.

గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో నీలం మధు తన భర్తను ఎన్నో మాటలు అన్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. నీలం మధు చెంప పగలగొట్టాలనుకున్నానని షాకింగ్ కామెంట్స్ చేశారు. సుధారాణి మాటలకు అక్కడే ఉన్న నీలం మధు, ఇతర కాంగ్రెస్ నేతలు కంగుతిన్నారు. మంత్రి కొండా సురేఖ సుధారాణిని శాంతింపజేసే ప్రయత్నం చేసినా వినలేదు. దీంతో ఆ వీడియో వైరల్‌ అవుతోంది.

Advertisment
తాజా కథనాలు