మెదక్ కాంగ్రెస్ లో మంటలు.. మంత్రి కొండా సురేఖ ముందే తీవ్ర వ్యాఖ్యలు! మెదక్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి నీలం మధుపై పటాన్ చెరు కాంగ్రెస్ నేత కాట శ్రీనివాస్ గౌడ్ సతీమణి తీవ్ర వ్యఖ్యలు చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో నీలం మధు తన భర్తను ఎన్నో మాటలు అన్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. నీలం మధు చెంప పగలగొట్టాలనుకున్నానని షాకింగ్ కామెంట్స్ చేశారు. By Nikhil 04 Apr 2024 in రాజకీయాలు తెలంగాణ New Update షేర్ చేయండి బీఆర్ఎస్ కంచుకోటగా చెప్పబడే మెదక్ ఎంపీ సీటుపై కాంగ్రెస్ జెండా ఎగురవేయాలని భావిస్తున్న రేవంత్ రెడ్డికి అంతర్గత కుమ్ములాటలు తలనొప్పిగా మారాయి. ముఖ్యంగా పటాన్ చెరు నుంచి పోటీ చేసి ఓటమి పాలైన కాట శ్రీనివాస్ గౌడ్ నుంచి ఎంపీ అభ్యర్థి నీలం మధుకు సహకారం అందడం లేదు. మంత్రి కొండా సురేఖ ఎదుటనే కాట శ్రీనివాస్గౌడ్ భార్య సుధారాణి తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో నీలం మధు తన భర్తను ఎన్నో మాటలు అన్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. నీలం మధు చెంప పగలగొట్టాలనుకున్నానని షాకింగ్ కామెంట్స్ చేశారు. సుధారాణి మాటలకు అక్కడే ఉన్న నీలం మధు, ఇతర కాంగ్రెస్ నేతలు కంగుతిన్నారు. మంత్రి కొండా సురేఖ సుధారాణిని శాంతింపజేసే ప్రయత్నం చేసినా వినలేదు. దీంతో ఆ వీడియో వైరల్ అవుతోంది. నీలం మధు చెంప పగలకొడతానన్న పటాన్చెరు కాంగ్రెస్ ఇంఛార్జి కాటా శ్రీనివాస్ గౌడ్ బార్య సుధారాణి మంత్రి కొండా సురేఖ ముందే నీలం మధును తిట్టిన కాటా సుధారాణి. నీలం మధు చెంప పగలకొట్టాలి అనుకున్న.. నీలం మధుకి కామన్ సెన్స్ లేదు అంటూ మంత్రి కొండా సురేఖ ముందు మెదక్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధి… https://t.co/jFHDzPBZ1P pic.twitter.com/fmDRJ9TeCk — Telugu Scribe (@TeluguScribe) April 4, 2024 #NULL మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి