Shock To BRS : ఉమ్మడి నల్గొండ జిల్లాలో బీఆర్ఎస్కు(BRS) మరో బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీ సీనియర్ నేత, శాసనమండలి చైర్మన్ సుఖేందర్ రెడ్డి(Gutha Sukender Reddy) కుమారుడు గుత్తా అమిత్ రెడ్డి కాంగ్రెస్ లో చేరారు. ఈ రోజు గుత్తా నివాసానికి తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జ్ దీప్దాస్ మున్షీ, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి(Komatireddy Venkat Reddy) వెళ్లి వారిని పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలో చేరేందుకు అంగీకరించడంతోనే కాంగ్రెస్(Congress) అగ్రనేతలు గుత్తా నివాసానికి వెళ్లి ఆహ్వానించినట్లు తెలుస్తోంది. అనంతరం కోమటిరెడ్డి, దీప్ దాస్ మున్షీ తో పాటు రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్లారు అమిత్ రెడ్డి. అమిత్ రెడ్డికి సీఎం రేవంత్ రెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. గుత్తా సుఖేందర్ రెడ్డికి ఉమ్మడి నల్లగొండ పాలిటిక్స్ పై మంచి పట్టు ఉంది. టీడీపీ(TDP) నుంచి ఒక సారి, కాంగ్రెస్ నుంచి 2 సార్లు ఆయన ఎంపీగా గెలుపొందారు. 2014లో విజయం తర్వాత ఆయన బీఆర్ఎస్ లో చేరారు.
ఇది కూడా చదవండి: KCR: త్వరలో తెలంగాణలో ఉప ఎన్నిక.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
Big Breaking : బీఆర్ఎస్ కు బిగ్ షాక్.. కాంగ్రెస్ లో చేరిన కీలక నేత కుమారుడు!
ఊహించినట్లుగానే శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కుమారుడు అమిత్ రెడ్డి బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పారు. సీఎం రేవంత్, మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. దీంతో పార్లమెంట్ ఎన్నికలకు కొన్ని రోజుల ముందు బీఆర్ఎస్ కు బిగ్ షాక్ తగిలింది.
Translate this News: