DK Aruna: నా గెలుపును రేవంత్ కూడా ఆపలేడు.. డీకే అరుణ సంచలన ఇంటర్వ్యూ

రానున్న ఎంపీ ఎన్నికల్లో కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు ఆ పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ. మహబూబ్ నగర్ ఎంపీగా తానను గెలిపించడానికి ప్రజలు సిద్దంగా ఉన్నారన్నారు. ఆర్టీవీతో ఆమె ప్రత్యేకంగా మాట్లాడారు.

New Update
సొంత జిల్లాలో సీఎం రేవంత్ కు బిగ్ షాక్.. డీకే అరుణ విజయం

మహబూబ్ నగర్ లోని ధర్నా చౌక్ లో బీజేపీ (BJP) నిర్వహించిన సత్యాగ్రహ దీక్షలో ఆ పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ (DK Aruna) పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆర్టీవీతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చుకుండా రైతులను మోసం చేసిందన్నారు. ఇంత వరకు రుణమాఫీ ఎందుకు చేయలేదని రేవంత్ సర్కార్ ను ప్రశ్నించారు డీకే అరుణ.

ఎన్నికల సమయంలో ఇచ్చిన రైతుబంధు పెంపు హామీని ఎందుకు అమలు చేయలేదో చెప్పాలన్నారు. 6 గ్యారెంటీలు అమలు కాలేదన్నారు. మహబూబ్ నగర్ జిల్లా అభివృద్ధి చెందాలంటే డీకే అరుణ ఎంపీగా గెలవాలని ప్రజలు డిసైడ్ అయ్యారన్నారు. తన గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. డీకే అరుణ పూర్తి ఇంటర్వ్యూను ఈ కింది వీడియోలో చూడండి.

Advertisment
తాజా కథనాలు