మణిపూర్ అంశంపై దద్దరిల్లిన పార్లమెంట్.. లోక్‌సభ వాయిదా

మణిపూర్ అంశంపై విపక్షాలు ఎప్పటిలాగే పార్లమెంట్ ఉభయ సభలనూ స్తంభింపజేశాయి. సోమవారం ఉదయం 11 గంటలకు సభ సమావేశం కాగానే ప్రతిపక్ష ఎంపీలు.. దీనిపై వెంటనే చర్చ చేపట్టాలని, ప్రధాని మోదీ ప్రకటన చేయాలని నినాదాలు చేశారు. ముఖ్యమైన బిల్లులు పెండింగులో ఉన్నాయని, వీటిపై చర్చించాలన్న లోక్ సభ స్పీకర్ సూచనను వారు పట్టించుకోలేదు. వారి రభసతో సభ మధ్యాహ్నం 2 గంటలవరకు వాయిదా పడింది.

New Update
మణిపూర్ అంశంపై దద్దరిల్లిన పార్లమెంట్.. లోక్‌సభ వాయిదా

మణిపూర్ అంశంపై మధ్యాహ్నం 2 గంటలకు ప్రభుత్వం చర్చ చేపడుతుందని రాజ్యసభలో మంత్రి పీయూష్ గోయెల్ ప్రకటించారు. దూధ్ కా దూధ్..పానీకా పానీ.. అని ఆయన వ్యాఖ్యానించారు. మణిపూర్ పరిస్థితిపై చర్చకు ప్రభుత్వానికి అభ్యంతరం లేదన్నారు. ఇప్పటికే మీరు 9 రోజులుగా సభా కార్యకలాపాలను స్తంభింపజేశారన్నారు. 267 నిబంధన కింద చర్చ జరగాలని కాంగ్రెస్ చీఫ్ మల్లిఖార్జున్ ఖర్గే డిమాండ్ చేశారు. విపక్షాల తీరుపై మంత్రి అనురాగ్ ఠాకూర్ మండిపడుతూ, మీరు ఏ అంశంపై చర్చ చేపట్టదలచినా అందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. అలాంటప్పుడు పార్లమెంటు సజావుగా నడిచేందుకు ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. పదేపదే ముఖ్యమైన బిల్లుల ఆమోదానికి అడ్డుపడడం తగదని హితవు పలికారు.

ఈ అంశంపై రాజ్యసభలో విపక్షాలు గందరగోళం సృష్టించాయి. ఎంపీలు తమ తమ సీట్లలో కూర్చోవలసిందిగా చైర్మన్ జగదీప్ ధన్ కర్ చేసిన సూచనను పట్టించుకోలేదు. విపక్ష కూటమి 'ఇండియా' కు చెందిన విపక్ష ప్రతినిధుల బృందం మణిపూర్ లో రెండు రోజుల పాటు పర్యటించిందని, వారి వాదనలను పార్లమెంట్‌లో వినిపించేందుకు లోక్ సభలో స్పీకర్, రాజ్యసభలో చైర్మన్ అనుమతించాలని ప్రతిపక్ష ఎంపీలు డిమాండ్ చేశారు. ఆ రాష్ట్రంలోని పరిస్థితిపై చర్చించేందుకు ప్రభుత్వం ఎందుకింత ఉదాసీనంగా వ్యవహరిస్తోందని ప్రశ్నించారు.

వివాదాస్పదమైన ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లును సోమవారం పార్లమెంటులో ప్రవేశపెట్టడం లేదని పార్లమెంటరీ వ్యవహారాలశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషీ ప్రకటించారు. ఈ బిల్లుకు సంబంధించిన అంశం లిస్టులో లేదన్నారు. మణిపూర్ పరిస్థితిపై అవిశ్వాస తీర్మానాన్ని 10 రోజుల్లో చేపట్టడం జరుగుతుందని ఆయన తెలిపారు. అయితే ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లులో కొన్ని మార్పులు, చేర్పులు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ఇందులో మూడు ముఖ్యమైన అంశాలను తొలగించి ఓ సూచన చేర్చాలని ప్రతిపాదించిందన్నారు.

నిజానికి ఈ బిల్లును హోంమంత్రి అమిత్ షా పార్లమెంటులో ప్రవేశపెడతారని ఇది వరకే వార్తలు వచ్చాయి. పైగా ఈ బిల్లు ముసాయిదా ప్రతులను ఎంపీలకు ప్రభుత్వం సర్క్యులేట్ చేసిందని కూడా పేర్కొన్నాయి. అయితే ఇప్పటికే మణిపూర్ ఆంశంపై విపక్షాల నుంచి 'పెను దుమారాన్ని' ఎదుర్కొంటున్న కేంద్ర ప్రభుత్వం ఈ బిల్లును ప్రస్తుతానికి వాయిదా వేయాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది.

Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

షాకింగ్.. 9కి పెరిగిన రేసుగుర్రాల మరణాల సంఖ్య

గుర్రాలను రవాణా చేసేటప్పుడు వాటికి ఫుడ్ పెట్టకపోవడం వల్ల చనిపోతున్నట్లు పశువైద్యులు అంటున్నారు. గుర్రాలను తగినంత స్థలంలో ఆహారం పెట్టకుండా రవాణా చేయడం వల్ల ఎనిమిది చనిపోయినట్లు తెలుస్తోంది.

New Update
horse power

Horse

స్థానిక కార్యకర్తలు గుర్రాలను రవాణా చేసి దయనీయ పరిస్థితుల్లో ఉంచారని జంతు సంక్షేమ సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఏప్రిల్ 25వ తేదీ నుంచి ఏప్రిల్ 29వ తేదీ వరకు హైదరాబాద్‌కు చెందిన ఒక సంస్థ తరపున సచిన్ తివారీ పర్యవేక్షణలో గుర్రాలను రవాణా చేశారు. మే 5న అనేక గుర్రాలు అస్వస్థతకు గురైనట్లు మధ్యప్రదేశ్ పశుసంవర్ధక శాఖ దర్యాప్తులో తేలింది.

ఇది కూడా చూడండి: Kannada row: తమిళ్ నుంచే తెలుగు పుట్టింది.. డీఎంకే నేత సంచలన ఆరోపణలు

ముగ్గురు సభ్యుల కమిటీ..

పనగర్‌కు చెందిన మనోజ్ వైశ్య, కాంద్రఖేడకు చెందిన సంజయ్ గుప్తా, జబల్‌పూర్‌కు చెందిన విష్ణు గుప్తా అనే ముగ్గురు సభ్యుల కమిటీ దర్యాప్తు నిర్వహించి, అన్ని చట్టపరమైన, పశువైద్య విధానాలను పాటించినట్లు నిర్ధారించింది. రవాణా సమయంలో లేదా తర్వాత నిర్లక్ష్యం లేదా దుర్వినియోగం జరిగినట్లు ఎటువంటి సంకేతాలు లేవని వారు తెలిపారు. ప్రయాణ సమయంలో 57 గుర్రాల ఆరోగ్య ధృవీకరణ పత్రాలు ఉన్నాయి. ఈ గుర్రాలను పది ట్రక్కులలో తగినంత స్థలం, ఆహారం, నీరు, సంరక్షకులతో గుర్రాలను రవాణా చేశారు.

ఇది కూడా చూడండి: Bengaluru Stampede : ఏం మనుషులురా మీరు... తొక్కిసలాటలోనూ లైంగిక వేధింపులు

రవాణాలో ఎనిమిది గుర్రాలు స్వల్ప గాయాల పాలైనప్పటికీ, వాటికి వెంటనే చికిత్స అందించారు. ఎనిమిది గుర్రాలు ఒత్తిడి, వాతావరణ మార్పులు, వేడి స్ట్రోక్ వల్ల మృతి చెందినట్లు తెలుస్తోంది. జబల్పూర్ శివార్లలోని అమ్ఖేరా గ్రామంలోని ఒక ప్రైవేట్ ఆస్తిలో గుర్రాలు ప్రస్తుతం ఉన్నాయని, తనిఖీ సమయంలో వాటికి ఆహారం, సంరక్షణ, చికిత్స కోసం తగిన ఏర్పాట్లు చేశారని అధికారులు తెలిపారు. 

ఇది కూడా చూడండి: Operation Kagar : చత్తీస్‌ గఢ్‌ రాష్ట్రం లో మరో భారీ ఎన్ కౌంటర్...అగ్రనేత మృతి ?

గుర్రాల పరిస్థితిపై మొదట్లో ఆందోళన వ్యక్తం చేసిన రాజస్థాన్‌కు చెందిన పోలో క్రీడాకారిణి లావణ్య షెకావత్ ఈ గుర్రాలపై స్పందించారు. ఇది న్యాయం కాదు - ఇది తెల్లబడటం. గుర్రాలు మూడు నుండి నాలుగు నెలలుగా సరైన ఆహారం లేకుండా ఉన్నాయని, పశు వైద్యులు చెబుతున్నారని ఆమె అన్నారు. అవి చికిత్స చేయని, లోతైన గాయాలతో భయంకరమైన స్థితిలో ఉన్నాయని, మరికొన్ని చనిపోయాయని ఆమె తెలిపారు. అయినా కూడా కమిటీ చర్యలు తీసుకోవడానికి నిరాకరిస్తోందని అంటున్నారు. జంతవులు భయపడుతున్నాయని, వాటికి న్యాయం జరగాలని ఆమె అన్నారు.

Advertisment
Advertisment