/rtv/media/media_files/2024/12/30/terminaliafruit7.jpeg)
పండ్లను తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మంచిది. టెర్మినలియా చెబులా లేదా హరితకి అనే పండు ఎన్నో ఔషధ గుణాలను కలిగి ఉంటుంది. ఇది ఎక్కువగా ఉష్ణ మండల ప్రాంతాల్లో కనిపిస్తుంది. డిసెంబర్ నెలలోనే ఈ పండ్లు వస్తాయి.
/rtv/media/media_files/2024/12/30/terminaliafruit5.jpeg)
టెర్మినలియా పండు లేత ఆకుపచ్చ, గోధుమ రంగులో ఉంటుంది కిలో 500 రూపాయల వరకు పలుకుతుంది. ఈ పండులో యాంటీ ఏజింగ్, యాంటీ హెల్మిన్థిక్, యాంటీ డయాబెటిక్ లక్షణాలు ఉన్నాయి.
/rtv/media/media_files/2024/12/30/terminaliafruit9.jpeg)
ఈ చెట్టు 10 నుంచి 15 అడుగుల పొడవు పెరుగుతుంది. ఈ చెట్టు డిసెంబర్ నెలలో మాత్రమే ఫలాలను అందిస్తుంది. ఈ పండ్లలో చాలా ఔషధ గుణాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.
/rtv/media/media_files/2024/12/30/terminaliafruit3.jpeg)
ఆయుర్వేదంలో హరితకి చెట్టు ముఖ్యపాత్ర పోషిస్తుంది. ఈ పండును అతిగా తింటే మాత్రం కొన్ని దుష్ప్రభావాలు ఉంటాయి. ఈ పండును క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల వృద్ధాప్యాన్ని దూరం చేస్తుందని వైద్యులు అంటున్నారు.
/rtv/media/media_files/2024/12/30/terminaliafruit8.jpeg)
టెర్మినలియాలో యాంటీ డయాబెటిక్ గుణాలు కూడా ఉన్నాయి. ఇది మధుమేహం నివారణకు ఉపయోగపడుతుంది. మధుమేహాన్ని అదుపులో ఉంచుతుంది. అంతేకాకుండా యాంటీ హెల్మిన్థిక్ లక్షణాలను కూడా కలిగి ఉంటుంది. కడుపులోని నులిపురుగులను కూడా తొలగిస్తుంది.
/rtv/media/media_files/2024/12/30/terminaliafruit4.jpeg)
హరితకి పండును తినడం వల్ల ఆకలి పెరుగుతుంది. వీటి గింజలు తింటే మలబద్ధకం సమస్యలు దూరమవుతాయి. ఉడకబెట్టి తింటే డైసెంటెరిక్ పోతుంది. అంతేకాకుండా వాత, పిత్త, కఫా దోషాలు తొలగిపోతాయి.
/rtv/media/media_files/2024/12/30/terminaliafruit2.jpeg)
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.