🔴 LIVE BREAKINGS: భీకర యుద్ధం.. రష్యాపై విరుచుకుపడ్డ ఉక్రెయిన్ బలగాలు

author-image
By Manoj Varma
New Update
BREAKING NEWS

breaking news

  • Jan 06, 2025 10:29 IST

    భీకర యుద్ధం.. రష్యాపై విరుచుకుపడ్డ ఉక్రెయిన్ బలగాలు

    ఉక్రెయిన్ బలగాలు రష్యాపై విరుచుకుపడ్డాయి. రష్యా ఆధీనంలోని కుర్స్‌‌లోకి ఉక్రెయిన్ బలగాలు ప్రవేశించి దాడులు జరిపాయి. ఈ దాడుల్లో రష్యాకి భారీగా ప్రాణ నష్టం జరిగిందని జెలెన్‌స్కీ తెలిపారు. ఈ భీకర యుద్ధంలో తమదే పై చేయి అని జెలెన్‌స్కీ వెల్లడించారు.

     



  • Jan 06, 2025 10:28 IST

    ప్రభుత్వానికి నష్టం వస్తే నా పిల్లల్ని అయినా ఊరుకోను



  • Jan 06, 2025 10:27 IST

    గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డ్స్‌లో నిరాశపరిచిన ఇండియన్ సినిమా

    గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డ్స్‌లో ఇండియన్‌ సినిమా ఆల్ వుయ్ ఇమాజిన్ యాజ్ లైట్ కు నిరాశే ఎదురైంది. పోటీ పడిన రెండు విభాగాల్లోనూ అవార్డు మిస్ అయింది. దీంతో సినీప్రియులు నిరాశకు గురయ్యారు. గత నెలలో ఈ అవార్డుల నామినేషన్‌లు ప్రకటించిన సంగతి తెలిసిందే.



  • Jan 04, 2025 10:39 IST

    కొత్త ఏడాది కలిసొచ్చిందిగా.. ఆకాశాన్ని తాకుతున్న డీమార్ట్ షేర్లు

    డీమార్ట్ పేరుతో వ్యాపారం చేస్తున్న అవెన్యూ సూపర్‌మార్ట్స్‌ లిమిటెడ్‌ షేర్లు 15 శాతం పెరిగాయి. ప్రస్తుతం డీమార్ట్ ఒక్కో షేర్ ధర రూ.5,360గా ఉంది. క్యూ3లో స్టాండలోన్‌లో కంపెనీ ఆదాయం రూ.15,565.23 కోట్లకు చేరినట్లు తెలుస్తోంది.

    Dmart
    Dmart Photograph: (Dmart)

     



  • Jan 04, 2025 10:37 IST

    నిజామాబాద్ టెన్త్ స్టూడెంట్స్‌ మిస్సింగ్ కేసులో బిగ్ ట్విస్ట్!

    కాంగ్రెస్‌ ప్రభుత్వం తీసుకొచ్చిన ఉచిత బస్సు పథకం ముగ్గురు విద్యార్థినుల అదృశ్యానికి కారణమైంది. బాలికలు స్కూల్‌కు రాకపోవడంతో ఉపాధ్యాయులు ఆరా తీయగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. వారిని పోలీసులు నిజామాబాద్‌ లో పట్టుకున్నారు.



  • Jan 04, 2025 10:36 IST

    బిగ్ షాక్ .. విజయసాయిరెడ్డికి ఈడీ నోటీసులు

    వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి  బిగ్ షాక్ తగిలింది. ఆయనకు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) మరోసారి నోటీసులు జారీ చేసింది.  కాకినాడ పోర్టు వ్యవహారంలో ఈడీ ఈ నోటీసులు జారీ చేయడం గమనార్హం. ఈ నెల 6 తేదీన విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొంది.

    ed sai
    ed sai Photograph: (ed sai)

     



Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు