డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గం మలికిపురంలో జనసేన ఎంపీటీసీ జక్కంపూడి విజయలక్ష్మి శ్రీనివాస్ కుమారుడు వినూత్నంగా ఆలోచించాడు. తనకు పవన్ కళ్యాణ్ పై ఉన్న తన అభిమానాన్ని ప్రదర్శించేందుకు ఏదో ఒకటి చేయాలనుకున్నాడు. అదే సమయంలో పవన్ వారాహి యాత్ర ప్రారంభించారు. దీంతో పవన్ కు వారాహి పోలికలతో ఓ చిన్న వాహనం తయారు చేసి ఇస్తే ఎలా ఉంటుందని ఆలోచించాడు. అదే పనిగా మొత్తానికి దాన్ని తయారుచేసి తన అభిమానాన్ని చాటుకున్నాడు.
ఆంధ్రప్రదేశ్ రోడ్లపై తిరుగుతున్న వారాహిని చూసి మినీ వారహిని తయారు చేశాడు. ఆ బుడతడు మినీ వారాహిని తయారు చేసేందుకు కేవలం పది రోజులు సమయం మాత్రమే తీసుకోవడం విశేషం. కేవలం పవన్ కళ్యాణ్ మీద ఉన్న అభిమానంతోనే ఆయనకు బహుమతిగా ఇవ్వడం మినీ వారాహిని తయారు చేశానని బాలుడు తెలిపాడు. ఇప్పటికే కోనసీమ జిల్లాలో యాత్ర ముగించుకుని నరసాపురం చేరుకున్న పవన్ కు త్వరలోనే మిని వారాహిని బహూకరించే అవకాశం ఉంది.
ఏపీలో వారాహీ యాత్ర విజయవంతం కావాలని ఈ బహుమతిని అందించినట్లు పవన్ కళ్యాణ్ అభిమాని తెలిపాడు. అంతేకాదు నెక్స్ట్ రాబోయే ఎలక్షన్లో జనసేన పార్టీ అధికారంలోకి రానుందని ధీమా వ్యక్తం చేశాడు. పవన్ కళ్యాణ్ చల్లగా ఉండాలని ఏపీ ప్రజలు కోరుకుంటున్నారని.. పవన్ కళ్యాణ్ పట్ల తనకున్న అభిమానాన్ని ఇలా చాటుకున్నట్లు చెప్పుకొచ్చాడు.
https://twitter.com/oneindiatelugu/status/1673279253545373696