Pindam OTT Release: ఓటీటీలో భయపెట్టడానికి వచ్చేస్తున్న పిండం.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే

రీసెంట్ గా థియేటర్స్ లో విడుదలై భయపెట్టిన 'పిండం' ఓటీటీ రిలీజ్ కు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ వేదిక ఆహాలో ఈ మూవీ స్ట్రీమింగ్ కానుంది. దీనికి సంబంధించి "త్వరలోనే రిలీజ్" అంటూ ఆహా ఓ పోస్టర్ రిలీజ్ చేసింది. కానీ స్ట్రీమింగ్ డేట్ ఎప్పుడు అనేది మాత్రం వెల్లడించలేదు.

New Update
Pindam OTT Release: ఓటీటీలో భయపెట్టడానికి వచ్చేస్తున్న పిండం.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే

Pindam OTT Release: హీరో శ్రీరామ్, ఖుషి రవి జంటగా నటించిన లేటెస్ట్ చిత్రం పిండం. హర్రర్ చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమా డిసెంబర్ 15 న థియేటర్స్ లో విడుదలైంది. థియేటర్స్ లో ప్రేక్షకులను భయపెట్టిన ఈ చిత్రం మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. 'ది స్కేరియస్ట్ ఫిల్మ్' అనే ట్యాగ్ తో థియేటర్స్ లో సందడి చేసిన ఈ చిత్రం ఓటీటీ ఆడియన్స్ ను అలరించడానికి సిద్ధమైంది.

పిండం ఓటీటీ రిలీజ్

అయితే లేటెస్ట్ అప్డేట్స్ ప్రకారం ఈ సినిమా త్వరలోనే ఓటీటీ స్ట్రీమింగ్ కు రానుంది. ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా వీడియో ఈ సినిమా ఓటీటీ హక్కులను దక్కించుకుంది. తాజాగా దీనికి సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ బయటకు వచ్చింది. త్వరలోనే పిండం ఓటీటీ రిలీజ్ అంటూ ఆహా వీడియో ఓ పోస్టర్ ను రిలీజ్ చేసింది. కానీ స్ట్రీమింగ్ డేట్ ఎప్పుడనేది మాత్రం ఇంకా వెల్లడించలేదు. ఇది ఓటీటీ ప్రేక్షకుల్లో మరింత ఆసక్తిని పెంచేసింది.

Also Read: Anchor Sreemukhi : పింక్‌ డ్రెస్‌లో మత్తెక్కిస్తున్న శ్రీముఖి.. ఫొటోలు చూస్తే ఫ్లాట్‌ అవ్వాల్సిందే

publive-image

పిండం సినిమా

పిండం సినిమాను కళాహి మీడియా బ్యానర్‌పై యశ్వంత్ దగ్గుబాటి నిర్మించారు. సాయికిరణ్ దైదా ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఈశ్వరి రావు, అవసరాల శ్రీనివాస్ ఈ చిత్రంలో ప్రధాన పాత్రల్లో నటించారు. పిండం సినిమాను 1990, 1930 లలో జరిగిన కథల ఆధారంగా రూపొందించారు. 2023 లో అత్యంత భయపెట్టిన మూవీగా ఈ చిత్రం విడుదలైంది.

Also Read: Sai Pallavi: చెల్లి ఎంగేజ్ మెంట్ వేడుకల్లో సాయి పల్లవి.. మాస్ డాన్స్

Advertisment
తాజా కథనాలు