• Skip to primary navigation
  • Skip to main content
  • Skip to primary sidebar
  • Skip to footer
Rtvlive.com

Rtvlive.com

News Updates from Andhra Pradesh and Telangana

  • నేషనల్
  • ఇంటర్నేషనల్
  • టాప్ స్టోరీస్
  • రాజకీయాలు
  • క్రైం
  • సినిమా
  • లైఫ్ స్టైల్
  • ట్రెండింగ్
  • వైరల్
  • బిజినెస్
  • స్పోర్ట్స్
  • జాబ్స్
  • తెలంగాణ
    • హైదరాబాద్
    • ఖమ్మం
    • వరంగల్
    • మెదక్
    • మహబూబ్ నగర్
    • నిజామాబాద్
    • నల్గొండ
    • ఆదిలాబాద్
    • కరీంనగర్
  • ఆంధ్రప్రదేశ్
    • విజయవాడ
    • తిరుపతి
    • వైజాగ్
    • ఒంగోలు
    • శ్రీకాకుళం
    • కర్నూలు
    • తూర్పు గోదావరి
    • పశ్చిమ గోదావరి
    • అనంతపురం
    • విజయనగరం
    • నెల్లూరు
    • గుంటూరు
    • కడప
  • హైదరాబాద్
  • వరంగల్
  • నిజామాబాద్
  • విజయవాడ
  • వైజాగ్
Home » ఇది పేదల విజయం.. ఇక నుంచి “అమరావతి మనందరి అమరావతి”

ఇది పేదల విజయం.. ఇక నుంచి “అమరావతి మనందరి అమరావతి”

Published on July 24, 2023 3:31 pm by BalaMurali Krishna

అమరావతి ప్రాంతంలోని ఆర్5 జోన్‌లో పేదల ఇళ్ల నిర్మాణాలకు సీఎం జగన్ శంకుస్థాపన చేశారు. అనంతరం లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన బహిరంసభలో మాట్లాడుతూ ప్రతిపక్షాలపై తీవ్ర విమర్శలు చేశారు. పేదలకు మంచి జరుగుతుంటే కోర్టుల్లో కేసు వేసి అడ్డుకుంటున్నారని మండిపడ్డారు.

Translate this News:

CM Jagan

50వేలకు పైగా ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన..

నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు పథకం కింద సీఆర్‌డీఏ పరిధిలోని ఆర్5జోన్‌లో 50వేలకు పైగా ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ నేపథ్యంలో కృష్ణాయపాలెంలో పేదల ఇళ్ల నిర్మాణానికి సీఎం జగన్ భూమి పూజ చేశారు. అనంతరం పైలాన్‌ను ఆవిష్కరించారు. వన మహోత్సవంలో భాగంగా మొక్కలు నాటారు. అక్కడ నిర్మించిన మోడల్‌ హౌస్‌ను కూడా సందర్శించి అధికారులను అభినందించారు. సీఆర్డీఏ పరిధిలో 1,402.58 ఎకరాల్లోని 25 లేఅవుట్‌లలో 50,793 ఇళ్ల నిర్మాణం జరగనుంది. . ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ.2.70 లక్షలు ఖర్చు చేయనుంది.

పెత్తందారులపై పేదల విజయం ఇది..

అనంతరం బహిరంగసభలో ప్రసగించిన జగన్.. ప్రతిపక్షాలపై ఘాటు విమర్శలు చేశారు. ఇవాళ చరిత్రలో నిలిచిపోయే రోజు అని తెలిపారు. ఇక నుంచి అమరావతి మనందరి అమరావతి అని వ్యాఖ్యానించారు. పెత్తందారుల మీద పేదల ప్రభుత్వం సాధించిన విజయంగా ఆయన దీనిని అభివర్ణించారు. చంద్రబాబు.. దత్తపుత్రుడు.. దుష్ట చతుష్ఠం కలిసి పేదలకు ఇళ్లు రాకూడదనే కుట్ర చేశారని ఆరోపించారు. పేదవాడికి ఇల్లు రాకూడదని అడ్డుకునేందుకు ఎన్నో ప్రయత్నాలు చేశారని విమర్శించారు. ఇందుకోసం సుప్రీంకోర్టు దాకా కూడా వెళ్లారని దుయ్యబట్టారు. పేదల వ్యతిరేకులంతా కోర్టుల్లో 18కేసులు వేశారని పేర్కొన్నారు. అలాగే పేదవాడికి ఇంగ్లీష్‌ మీడియం అవసరమా? అని ప్రశ్నించిన వాళ్లు.. తమ పిల్లలను ఇంగ్లీష్‌ మీడియం స్కూళ్లలో చదివిస్తారని మండిపడ్డారు. ప్రజలకు సంక్షేమం అందిస్తుంటే రాష్ట్రం మరో శ్రీలంక అవుతుందంటూ ప్రచారం చేస్తున్నారన్నారు. మరి చంద్రబాబు తన హయంలో పేదలకు ఉపయోగపడే పనులు ఎందుకు చేయలేదు అని నిలదీశారు.

పవన్‌ కల్యాణ్‌పై ఘాటు విమర్శలు..

ఇక సంబంధిత శాఖ మంత్రి జోగి రమేశ్ మాట్లాడుతూ జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌పై ఘాటు విమర్శలు చేశారు. సీఎం జగన్ పేదలకు అన్నం పెడుతున్నారు.. గూడు కల్పిస్తున్నారు.. ఆయనను ఎవరూ టచ్ కూడా చేయలేరన్నారు. పవన్ కల్యాణ్‌ పెళ్లాలనే కాదు పార్టీలను కూడా మారుస్తున్నారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పవన్ పిచ్చి కుక్కలా వ్యవహరిస్తున్నారనిపేర్కొన్నారు. ఊరపంది తిరిగినట్టు లోకేశ్ రోడ్లపై తీరుగుతున్నాడని విమర్శలు చేశారు. జగన్‌తో లోకేశ్‌కు పోటీనా అని ఎద్దేవాచేశారు. అలాగే పెత్తందార్ల పక్కన పేదలు ఉండకూడదని కోర్టుకు వెళ్లిన వ్యక్తి ముసలి నక్క చంద్రబాబు అని దుయ్యబట్టారు.

నల్ల బెలూన్లుతో అమరావతి రైతులు నిరసన..

మరోవైపు అమరావతి రైతులు కృష్ణాయపాలెం, తుళ్లూరు, వెంకటపాలెం శిబిరాల వద్ద నల్ల బెలూన్లుతో నిరసన కార్యక్రమం చేపట్టారు. . ఎగరేసి ఆర్ 5 జోన్‌ అంశంపై హైకోర్టులో తీర్పు రిజర్వ్‌లో ఉన్నప్పటికీ.. ఇళ్ల నిర్మాణం ఎలా చేపడతారని ప్రశ్నిస్తున్నారు. రాజధాని రైతులను కావాలనే ఇబ్బంది పెడుతున్నారని విమర్శించారు. తమ సమాధులపై నుంచి ఎన్నికలకు వెళ్తున్నారని మండిపడ్డారు. రైతులు బయటకు రాకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటుచేశారు.

Primary Sidebar

Breaking: సుప్రీంకోర్టులో చంద్రబాబు క్వాష్‌ పిటిషన్‌పై విచారణ అక్టోబర్ 3కు వాయిదా

Breaking: సుప్రీంకోర్టులో చంద్రబాబు క్వాష్‌ పిటిషన్‌పై విచారణ అక్టోబర్ 3కు వాయిదా

Donald Trump

Donald Trump: అవును అతను మోసం చేశాడు…తేల్చిచెప్పిన న్యూయార్క్ జడ్జ్

ind vs aus third match

 ind vs aus: భారత్-ఆస్ట్రేలియా మూడవ వన్డే…టాస్ గెలిచిన ఆస్ట్రేలియా

Khairatabad Ganesh: రేపు ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర సాగేది ఎలాగంటే..?

Khairatabad Ganesh: రేపు ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర సాగేది ఎలాగంటే..?

lokesh: ఏపీ హైకోర్టులో నారా లోకేష్ ముందస్తు బెయిల్ పిటిషన్

lokesh: ఏపీ హైకోర్టులో నారా లోకేష్ ముందస్తు బెయిల్ పిటిషన్

Chandrababu Case: ఉండవల్లి రిట్ పిటిషన్ మరో బెంచ్ కు బదిలీ

Chandrababu Case: ఉండవల్లి రిట్ పిటిషన్ మరో బెంచ్ కు బదిలీ

BSNL కస్టమర్లకు గుడ్ న్యూస్..600జీబీ డేటా.. ఏడాదిపాటు ఫ్రీ కాలింగ్..ఈ బెస్ట్ ప్లాన్ పై ఓ లుక్కేయండి..!!

BSNL కస్టమర్లకు గుడ్ న్యూస్..600జీబీ డేటా.. ఏడాదిపాటు ఫ్రీ కాలింగ్..ఈ బెస్ట్ ప్లాన్ పై ఓ లుక్కేయండి..!!

Malla Reddy: మల్కాజ్‌గిరిలో మైనంపల్లి వర్సెస్ మల్లారెడ్డి

Malla Reddy: మల్కాజ్‌గిరిలో మైనంపల్లి వర్సెస్ మల్లారెడ్డి

Footer

Copyright © 2023 · Rayudu Vision Media Limited | Technology Powered by CultNerds
About Us | Disclaimer | Contact Us | Feedback & Grievance | Advertise With Us | Privacy Policy | Sitemap | News Sitemap
RTV News provides latest Telugu Breaking News, Political News
Telangana & AP News headlines Live, Latest Telugu News Online