రాజకీయాల్లోకి రీ-ఎంట్రీ ఇవ్వనున్న లగడపాటి

రాష్ట్ర విభజన సమయంలో లోక్‌సభలో పెప్పర్ స్ప్రే ప్రయోగించి దేశవ్యాప్తంగా చర్చకు తెరలేపారు. ఉమ్మడి ఏపీ విభజన జరిగితే రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని ప్రకటించారు. మళ్లీ రాజకీయాల్లోకి రీ - ఎంట్రీ ఇవ్వనున్నారనే టాక్‌ వినిపిస్తోంది. అయితే టీడీపీ నుండి పోటీ చేయనున్నారా. కొడుకును రాజకీయాల్లోకి దించుతారా అనే చర్చ జరుగుతోంది.

New Update
రాజకీయాల్లోకి రీ-ఎంట్రీ ఇవ్వనున్న లగడపాటి

lagadapati-rajagopal-planning-for-a-political-reentry-after-kesineni-nani-resignation

విజయవాడ మాజీ ఎంపీగా రెండుసార్లు పనిచేసిన వ్యక్తి, తెలుగు రాష్ట్రల ప్రజలకు అత్యంత సుపరిచితుడు. అయితే గత కొంతకాలంగా లగడపాటి రాజగోపాల్ పాలిటిక్స్‌లోకి రీ ఎంట్రీ ఇస్తారనే ప్రచారం మొదలైంది. టీడీపీ పార్టీలోకి చేరి ఎంపీగా పోటీ చేస్తారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మరోవైపు టీడీపీతోనే తన కుమారుడిని రాజకీయ ఆరంగేట్రం చేయిస్తారనే ప్రచారం కూడా జరుగుతుంది. ఇంతకీ మరి లగడపాటి రాజగోపాల్ పొలిటికల్ ఎంట్రీ ఎలా ఉండబోతుంది..? టీడీపీలోనే చేరతారా? ఎంపీగా పోటీ చేస్తారా? కొడుకును కూడా తనతోపాటే రాజకీయాల్లోకి తీసుకువస్తారా? అనేదానిపై విజయవాడ పొలిటికల్ సర్కిల్‌లో చర్చ జరుగుతుంది.

ఇచ్చిన మాటకు కట్టుబడే..

విజయవాడ ఎంపీగా లగడపాటి రాజగోపాల్ గతంలో కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా వ్యవహరించారు. 2004,2009లో విజయవాడ లోక్‌సభ నుంచి పోటీ చేసి ఘన విజయం సాధించారు. అంతేకాదు విజయవాడ రాజకీయాలు, పాలనలో తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకున్నారు. రాష్ట్ర విభజన జరిగితే రాజకీయాలకు ఫుల్ స్టాప్ పెట్టేస్తానని శపథం చేశారు. అయితే విభజన జరగడంతో రాజకీయాలకు గుడ్ బై చెప్పేశారు. అనంతరం పొలిటికల్ సర్వేలలో ఎక్స్‌పర్ట్‌ అయ్యారు. గతంలో చేసిన సర్వేలు కూడా చాలా వరకు నిజం అయ్యాయి. దీంతో అప్పటి నుంచి ఆంధ్రా ఆక్టోపస్‌గా లగడపాటి పేరు తెచ్చుకున్నారు. అయితే 2018 తెలంగాణ ఎన్నికలు, 2019లో ఏపీ ఎన్నికల ఫలితాలపై లగడపాటి సర్వేలన్నీ రివర్స్ అయ్యాయి. దీంతో లగడపాటి సర్వేలకు సైతం గుడ్ బై చెప్పేశారు.

టీడీపీతోనే రీ -ఎంట్రీ..

లగడపాటి రాజగోపాల్ పాలిటిక్స్‌లోకి రీ ఎంట్రీ అంటూ ఇస్తే అది టీడీపీతోనే అని ప్రచారం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ ఎంపీగా లగడపాటి రాజగోపాల్ గెలుపొందినప్పటికీ అన్ని పార్టీల నేతలతో సత్సంబంధాలు కొనసాగించారు. అలాగే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతోనూ మంచి స్నేహం కొనసాగించారు. రాష్ట్ర విభజన అనంతరం రాజకీయాలకు దూరమైన లగడపాటి రాజగోపాల్ అనంతరం టీడీపీ అధినేత చంద్రబాబుకు అత్యంత సన్నిహితంగా మెలిగారు. 2014లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత పలుమార్లు భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన విభజనచట్టంలోని హామీల అమలుపై పోరాటం చేయాలని గుర్తు చేశారు. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా అంశంపై కూడా పోరాటానికి సంబంధించిన పలు సూచనలు సైతం లగడపాటి రాజగోపాల్ చేసిన సంగతి తెలిసిందే.

లగడపాటి తనయుడిపైనా స్పెషల్ ఫోకస్..

లగడపాటి రాజగోపాల్ తనయుడుని బరిలోకి దించితే ఎలా ఉంటుందనే ఆలోచన టీడీపీ చేస్తున్నట్లు తెలుస్తోంది. గన్నవరం నియోజకవర్గంలో లగడపాటి రాజగోపాల్‌కు మంచి పట్టుంది. అదే తరుణంలో కమ్మ సామాజిక వర్గం ఓటు బ్యాంకు సైతం అత్యధికంగా ఉంది. ఇవన్నీ కలిసి వస్తాయనే ఆలోచనలో టీడీపీ ఉన్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. అంటే లగడపాటి రాజగోపాల్ టీడీపీలో చేరితే అటు లోక్‌సభ కీలకమైన అసెంబ్లీలో బలమైన అభ్యర్థులు లభించినట్లు అవుతుందని టీడీపీ భావిస్తుంది. ఈ తరుణంలోనే లగడపాటికి గాలం వేస్తున్నట్లు తెలుస్తోంది.

Advertisment
Advertisment
తాజా కథనాలు