KTR: జగన్ పై దాడి..టేక్ కేర్ అన్నా అంటూ కేటీఆర్ పోస్ట్..!

ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై రాళ్ల దాడిని తెలంగాణ నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. విజయవాడలో సీఎం జగన్ పై రాళ్లదాడిని తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్వీట్ చేస్తూ తీవ్రంగా ఖండించారు. జాగ్రత్తగా ఉండాలి జగన్ అన్న..అంటూ ట్వీట్ చేశారు కేటీఆర్.

New Update
KTR: జగన్ పై దాడి..టేక్ కేర్ అన్నా అంటూ కేటీఆర్ పోస్ట్..!

KTR: ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై రాళ్ల దాడిని వైసీపీ నేతలతోపాటు , తెలంగాణ నేతలు కూడా తీవ్రంగా ఖండిస్తున్నారు. విజయవాడలో సీఎం జగన్ పై రాళ్లదాడిని తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్వీట్ చేస్తూ తీవ్రంగా ఖండించారు. జాగ్రత్తగా ఉండాలి జగన్ అన్న..అంటూ ట్వీట్ చేశారు కేటీఆర్. ప్రజాస్వామ్యంలో ఇలాంటి దాడులకు హింసలకు ఎలాంటి తావులేదని..ఇలాంటి ఘటనలు జరగకుండా కేంద్ర ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలని తన పోస్టులో కోరారు కేటీఆర్.

కాగా విజయవాడ సింగ్ నగర్ డాబా కోట్ల సెంటర్ వద్ద ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్రలో సీఎం జగన్ పై కొందరు ఆగంతకులు రాళ్లు విసరడం కలకలం రేపింది. సీఎం జగన్ కు ఓవైపు పూలు చల్లుతుండగా.. మరో వైపు కొందరు ఆగంతకులు రాళ్లు విసిరారు. ఈ ఘటనలో సీఎం జగన్ ఎడమ కంటికి రాయి తగిలింది. రాయి బలంగా తగలడంతో ఆయన ఎడమ కన్ను వాచింది. సీఎం జగన్ కు బస్సులో ప్రథమ చికిత్స అందిస్తున్నారు. ఈ దాడిలో MLA వెల్లంపల్లి ఎడమ కంటికిసైతం గాయం అయింది.

ఇది కూడా చదవండి: ఏపీ సీఎం జగన్ పై దాడి దురదృష్టకరం..వైఎస్ షర్మిల ట్వీట్..!

#jagan #ktr
Advertisment
తాజా కథనాలు