/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/MLA-KTR.jpg)
MLA KTR: నీట్ యూజీ ఎగ్జామ్ వ్యవహారంలో కేంద్రం తీరుపై కేటీఆర్ మండిపడ్డారు. లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్ ప్రమాదంలో పడినా కేంద్రం పట్టించుకోవడం లేదని ఫైర్ అయ్యారు. ఓవైపు గ్రేస్ మార్కుల గందరగోళం.. మరోవైపు పేపర్ లీకేజీల వ్యవహారంతో తల్లిదండ్రుల్లో ఆందోళనలో ఉన్నారని అన్నారు. పరీక్షా పై చర్చ నిర్వహించే ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు.. నీట్ వ్యవహారంపై స్పందించాలని కోరారు. మొత్తం వ్యవహారంలో సమగ్ర విచారణ చేపట్టాలి.. వెంటనే బాధ్యులను శిక్షించాలని డిమాండ్ చేశారు. కష్టపడి చదివిన విద్యార్థులకు నష్టం జరగకుండా చూడాలని అన్నారు. ఈ నేపథ్యంలో కేంద్రానికి బహిరంగ లేఖ రాశారు కేటీఆర్.
నీట్ స్కాంపై కేంద్ర ప్రభుత్వానికి బహిరంగ లేఖ రాసిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. pic.twitter.com/P8Vi9R0dQQ
— Telugu Scribe (@TeluguScribe) June 16, 2024