KTR: బీఆర్‌ఎస్‌ ఓటమిపై స్పందించిన కేటీఆర్..

తెలంగాణ లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ ఒక్క స్థానంలో కూడా గెలవకపోవడంతో కేటీఆర్ స్పందించారు. ఎన్నికల ఫలితాలు నిరాశపరిచినప్పటికీ.. ఎట్టిపరిస్థితుల్లో కుంగిపోయేది లేదని.. ఎప్పటి లాగే ప్రజాసమస్యలపై పోరాడుతూనే ఉంటామని స్పష్టం చేశారు.

MLA KTR : రైతుభరోసా ఊసే లేదు.. కేటీఆర్ విమర్శలు
New Update

తెలంగాణ లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ ఖాతా తెరవలేదు. పోటీ చేసిన 17 సీట్లలో కూడా ఒక్క స్థానంలో కూడా గెలవలేదు. ఈ నేపథ్యంలో తమ పార్టీ ఓటమిపై మాజీ మంత్రి కేటీఆర్‌ ఎక్స్‌ వేదికగా స్పందించారు. లోక్ సభ ఎన్నికల ఫలితాలు నిరాశపరిచాయని చెప్పారు. మళ్లీ త్వరలోనే బీఆర్ఎస్ పుంజుకుంటుదన్న నమ్మకం వ్యక్తం చేశారు. పార్టీ స్థాపించిన 24 ఏళ్ల సుదీర్ఘమైన ప్రస్థానంలో ఎన్నో రకాల ఎత్తుపల్లాలను చూశామని గుర్తు చేశారు. అద్భుతమైన విజయాలతో పాటు అనేక ఎదురు దెబ్బలు ఎదుర్కొన్న అనుభవం పార్టీకి ఉందన్నారు. బీఆర్ఎస్ పార్టీగా తమకు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడాన్ని మించిన గౌరవం, విజయం మరేది లేదని గుర్తు చేశారు.

Also Read: ఏపీలో కూటమి విజయంపై స్పందించిన సీఎం రేవంత్..

గతంలోనూ ఇలాంటి ఎదురుదెబ్బలు తిన్నప్పటికీ ప్రజాదరణతో బీఆర్ఎస్ పుంజుకున్న సందర్భాలెన్నో ఉన్నాయన్నారు. తెలంగాణ సాధించటంతో పాటు ఒక ప్రాంతీయ పార్టీగా రెండుసార్లు అద్భుతమైన మెజార్టీ 2014 లో 63 సీట్లు, 2018 లో 88 సీట్లతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నామన్నారు. ప్రస్తుత శాసనసభలోనూ మూడో వంతు సీట్లతో ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ కొనసాగుతుందన్నారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ స్వల్ప తేడాతోనే ఓటమి పాలైందని గుర్తు చేశారు.

ఆరు నెలల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఫలితాలు నిరాశ కలిగించినప్పటికీ లోక్ సభ ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం నాయకులు, కార్యకర్తలు ఎంతో శ్రమించారని.. వారందరికీ పార్టీ తరఫున కృతజ్ఞతలు తెలియజేశారు. ఎన్నికల ఫలితాలు నిరాశపరిచినప్పటికీ.. ఎట్టిపరిస్థితుల్లో కుంగిపోయేది లేదని.. ఎప్పటి లాగే ప్రజాసమస్యలపై పోరాడుతూనే ఉంటామని స్పష్టం చేశారు.

Also Read: ఇదొక చారిత్రక ఘట్టం.. దేశ ప్రజలకు ధన్యవాదాలు చెప్పిన మోడీ!

#ktr #brs
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe