హైదరాబాద్-విజయవాడ హైవేపై భారీగా వరద నిలిచిపోవడంతో వాహనాలు బారులు తీరాయి. అటు నందిగామ(Nandigaama) దగ్గర హైవేపై భారీగా ట్రాఫిక్ స్తంభించింది. నందిగామ బస్టాండ్లోనే ఆర్టీసీ బస్సులు ఉండిపోయాయి. ఇక గంటల తరబడి బస్సుల్లోనే ప్రయాణికుల ఇబ్బందులు పడాల్సి వస్తోంది. తమను గమ్యస్థానాలకు చేర్చాలని ప్రయాణికులు కోరుతున్నారు. ఇటు ఆర్టీసీ అధికారుల తీరుపై ప్రయాణికుల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అటు మున్నేరు, వైరా, కట్టలేరు వాగులు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో సమీప గ్రామ ప్రజలను కలవర పెడుతోంది. దీంతో నార్కట్ పల్లి, మిర్యాలగూడ, దాచేపల్లి, పిడుగురాళ్ల, సత్తెనపల్లి, గుంటూరు, విజయవాడ మీదుగా వైజాగ్ వెళ్ళాలని సూచిస్తున్నారు. మరోవైపు ఇవాళ కృష్ణా యూనివర్సిటీ(Krishna University)కి సంబంధించిన పరీక్ష ఉండడంతో పోలీసులు విద్యార్థుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
పరీక్ష కోసం పాట్లు:
రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ వరుణుడు బీభత్సం సృష్టిస్తున్నాడు. గ్యాప్ ఇవ్వకుండా దంచికొడుతున్నాడు. కొన్ని ప్రాంతాల్లో వర్షం ఆగిపోయినా రోడ్డుపై వరద నీరు మాత్రం అలానే నిలిచి ఉంది. మరోవైపు ఇవాళ కృష్ణా యూనివర్సిటీకి సంబంధించిన చివరి పరీక్ష ఉండడంతో గ్రామీణ ప్రాంతాల్లోని అభ్యర్థులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల(kanchikacherla) మండలం గన్నేపల్లిలో నివాసముండే విద్యార్థులు నందిగామలో పరీక్ష రాయాల్సి ఉండగా.. హైవేపై భారీ స్థాయిలో వరద నిలిచిపోయింది. ఆ వరద నీరుకు వాహనాలు ఇరువైపులా నిలిచిపోయాయి. దీంతో ఏం చేయాలో విద్యార్థులకు అర్థంకాలేదు.. ఇంతలోనే పోలీసులు సీన్లోకి ఎంట్రీ ఇచ్చారు. విద్యార్థుల పరిస్థితిని అర్థం చేసుకున్నారు.. వాళ్లు ఎగ్జామ్ టైమ్కి చేరుకునేలా ఏర్పాట్లు చేశారు
క్రేన్పై రయ్ రయ్..పరీక్షకు విద్యార్థులు ఎలా వెళ్తున్నారో తెలిస్తే షాక్ అవుతారు!
ఇవాళ(జులై 28) కృష్ణా యూనివర్సిటీకి సంబంధించిన చివరి పరీక్ష ఉండడంతో కంచికచర్లలోని విద్యార్థులను క్రేన్ల సాయంతో పోలీసులు పరీక్ష సెంటర్లకు తరలించారు. నందిగామలో పరీక్ష రాయాల్సి ఉండగా రహదారిపై భారీగా వరద నీరు నిలిచిపోవడంతో క్రేన్లను తీసుకొచ్చి అభ్యర్థులను పరీక్ష సమయానికి ఎగ్జామ్ సెంటర్కి తీసుకెళ్లారు.
Translate this News: