తెలుగు రాష్ట్రాల్లో వరదలు సృష్టిస్తున్న విధ్వంసానికి సామాన్య ప్రజలు బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తుంటే మరోవైపు పశువుల పరిస్థితి మరింత దయనీయంగా ఉంది. వరదల నుంచి ప్రాణాలు కాపాడుకునేందుకు ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తుంటారు అధికారులు. అటు పశువుల సంగతి మాత్రం పెద్దగా పట్టించుకోరు. ముఖ్యంగా ఆవులు, గేదెల పరిస్థితి దారుణంగా ఉంది. చాలా మంది రైతులకు ఈ రెండే జీవనాధారం. ముఖ్యంగా కోనసీమ జిల్లా(Konaseema district) లంక గ్రామాల్లో వ్యవసాయంపై ఆధారపడే కుటుంబాలు ఎక్కువగా ఉంటాయి. గోదావరి(godavari) ఉగ్రరూపం దాల్చుతుండడంతో తమ పశువులను కాపాడుకునేందుకు నరకయాతన అనుభవిస్తున్నారు రైతులు.
పూర్తిగా చదవండి..లంక గ్రామస్తుల ఆవేదన.. పశువులను తరలించేందుకు నరకయాతన
కోనసీమ జిల్లాలో గోదావరి ఉగ్రరూపం దాల్చుతోంది. దీంతో అక్కడి పశువులను(ఆవులు, గేదెలు) సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు గ్రామస్తులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. పడవుల సహాయంతో పశువులను అవతలి ఒడ్డు నుంచి మరో వైపునకు తరలిస్తున్నారు.
Translate this News: