ఇండియా పోస్ట్ అందించే దీర్ఘకాలిక సేవింగ్స్ సర్టిఫికెట్లలో కిసాన్ వికాస్ పత్రం(KVP)కూడా ఒకటి. ముఖ్యంగా రైతుల్లో పొదుపును ప్రోత్సహించేందుకు పోస్టల్ డిపార్ట్మెంట్ ఈ స్కీమ్ని అమల్లోకి తీసుకొచ్చింది. అయితే ప్రస్తుతం ఈ పత్రాలను భారత్ పౌరులు ఎవరైనా సరే కొనుగోలు చేసేందుకు అవకాశం ఉంటుంది. దేశంలో ద్రవ్యోల్బణం ఎప్పుడు ఎలా ఉంటుందో ఊహించడం కష్టం. అందుకే పెట్టుబడికి ప్రమాదం ఉండని మార్గాలే ఎప్పటికైనా బెస్ట్. అందుకే రిస్క్ ఫ్రీ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ను ఎంచుకోవాలి. దీనికోసం పోస్టాఫీస్ స్మాల్ సేవింగ్ స్కీమ్ ఒక మంచి ఆప్షన్. మీరు మీ డబ్బును రెట్టింపు చేయాలనుకుంటే, పోస్టాఫీస్ కిసాన్ వికాస్ పత్ర పథకంలో పెట్టుబడి పెట్టవచ్చు. ఇందులో మీ డబ్బు కేవలం 115 నెలల్లోనే రెట్టింపు అవుతుంది.
పూర్తిగా చదవండి..KVP: ఈ పోస్టాఫీస్ స్కీమ్తో మీ డబ్బు రెట్టింపు అవుతాయి..తక్కువ సమయంలో అదిరిపోయే రాబడి!
ఈ ఏడాది ఏప్రిల్ నుంచి కిసాన్ వికాస్ పత్ర(KVP) పథకం వడ్డీ రేటును పెంచాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన తర్వాత, ఈ పథకం డిపాజిట్లను రెట్టింపు చేసే కాల వ్యవధి తగ్గింది. దీంతో KVP పథకంలో పెట్టుబడి పెట్టాలనుకునే వారి సంఖ్య పెరుగుతోంది. సంవత్సరానికి రూ. 5 లక్షలు వేస్తే 115నెలల్లో అది రూ.10లక్షలు అవుతుంది. ఎందుకంటే వడ్డీ 7.5శాతంగా ఉంది. కాలవ్యవధి కూడా 115 నెలలే (9 సంవత్సరాల 7 నెలలు).
Translate this News: