AP, TG Floods: వరద బాధితులకు LG సంస్థ శుభవార్త.. ఆ సేవలు ఫ్రీ, 50% డిస్కౌంట్ కూడా!

ఖమ్మం, విజయవాడలో వరద బాధితులకు ప్రముఖ LG సంస్థ శుభవార్త చెప్పింది. దెబ్బతిన్న తమ కంపెనీ పరికరాలకు ఫ్రీగా సర్వీస్ చేస్తామని ప్రకటించింది. ఇంకా పాడైపోయిన స్పేర్ పార్ట్స్ పై 50% డిస్కౌంట్ ఇవ్వనున్నట్లు తెలిపింది. ఈ ఆఫర్ ఖమ్మం, విజయవాడలో మాత్రమే అందుబాటులో ఉంటుంది.

New Update
AP, TG Floods: వరద బాధితులకు LG సంస్థ శుభవార్త.. ఆ సేవలు ఫ్రీ, 50% డిస్కౌంట్ కూడా!

తెలంగణలోని ఖమ్మం జిల్లాతో పాటు ఏపీలోని విజయవాడ ప్రాంతంలో భారీగా వరదలు వచ్చిన విషయం తెలిసిందే. ఊహించని ఈ వరదల కారణంగా అనేక మంది నివాసాల్లో టీవీలు, ఎలక్ట్రానిక్ పరికరాలు నీట మునిగి పాడై పోయాయి. అసలే వరదల కారణంగా తీవ్రంగా నష్టపోయిన ప్రజలకు వీటిని రిపేర్ చేయించుకోవడం కష్టంతో కూడుకున్న పని. నీట మునగడంతో రిఫ్రిజిరేటర్లు, ఏసీలు, టీవీలు తదితర వస్తువుల్లోని అనేక పరికరాలు పాడై పోయే ప్రమాదం ఉంటుంది. ఈ నేపథ్యంలో ప్రముఖ LG ఎలక్ట్రానిక్స్ సంస్థ వినియోగదారులకు శుభవార్త చెప్పింది.

publive-image
వరద బాధితులకు ఫ్రీగా సర్వీస్ అందిస్తామని ప్రకటించింది. పాడైపోయిన స్పేర్ పార్ట్స్ పై ఏకంగా 50% డిస్కౌంట్ ఇవ్వనున్నట్లు తెలిపింది. ఈ ఆఫర్ ఈ నెల 7 నుంచి 16వ తేదీ వరకు మాత్రమే అందుబాటులో ఉంటుందని తెలిపింది ఎల్జీ. విజయవాడ, ఎన్టీఆర్, ఖమ్మం జిల్లాలోని ఆథరైజ్డ్ సర్వీస్ సెంటర్లలో ఈ ఆఫర్ ఉంటుందని స్పష్టం చేసింది LG. ఇతర వివరాలకు 08069379999, 9711709999 నంబర్లను సంప్రదించాలని సూచించింది.

Advertisment
తాజా కథనాలు