గత ప్రభుత్వ హయాంలో ఖమ్మం నగరంలో విచ్చలవిడిగా భూములను ఆక్రమించి భవనాలు నిర్మించారని సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇందుకు సంబంధించి త్వరలోనే సర్వే చేస్తామని ప్రకటించారు. బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆక్రమణల గుట్టు కూడా తేల్చాల్సి ఉందని స్పష్టం చేశారు. ఈ రోజు ఖమ్మంలో పర్యటన సందర్భంగా వరదల తీవ్రతపై మీడియాతో సీఎం రేవంత్ చిట్ చాట్ చేశారు. ఖమ్మం జిల్లాలో రికార్డు స్థాయిలో 42 సెం.మీ వర్షపాతం నమోదైందని తెలిపారు. ఈ నేపథ్యంలోనే నష్టం భారీగా వాటిల్లిందన్నారు.
Khammam Floods-Revanth Reddy: ఖమ్మంలో వరదలకు కారణం వారే.. సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు!
గత ప్రభుత్వం చేపట్టిన మిషన్ కాకతీయ లోపభూయిష్టంగా జరిగిందని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. అందుకే చెరువులు తెగిపోతున్నాయన్నారు. బీఆర్ఎస్ హయాంలో ఖమ్మంలో విచ్చలవిడిగా భూములను ఆక్రమించి భవనాలు నిర్మించారన్నారు. మాజీ మంత్రి పువ్వాడ ఆక్రమణల గుట్టు తేలుస్తామన్నారు.
Translate this News: