వారంలో పెళ్లి..అంతలోనే మృత్యువు ఒడిలోకి..!!

వారంలో పెళ్లి.. అంతలోనే మృత్యువు ఒడిలోకి చేరింది భార్గవి అనే యువతి. ఈ విషాద ఘటన ఖమ్మం జిల్లా కామేపల్లి మండలంలో చోటుచేసుకుంది. అపెండిక్స్ తో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ పెళ్లి కూతురు దురిశెట్టి భార్గవి మృతి చెందింది. భార్గవి పెళ్లి ఘనంగా చేయాలని భావించిన తల్లిదండ్రులు.. కూతురి మృతితో శోకసంద్రంలో మునిగిపోయారు.

New Update
వారంలో పెళ్లి..అంతలోనే మృత్యువు ఒడిలోకి..!!

అకస్మాత్తుగా భార్గవి తీవ్ర అనారోగ్యానికి గురైంది. జ్వరం, కడుపునొప్పి రావడంతో ఆసుపత్రిలో చేరింది పెళ్లి కూతురు భార్గవి. అపెండిక్స్ సమస్యతో బాధపడడంతో చికిత్స పొందుతూ మృతి చెందింది. భార్గవి మృతి చెందడంతో ఆ కుటుంబంలో విషాధ ఛాయలు అలుముకున్నాయి. గత కొన్ని నెలలు క్రితం భార్గవి చెల్లెలు కూడా మృతి చెందినట్లు తెలుస్తోంది. తిరుపతిరావు మాధవిలకు ఇద్దరు ఆడపిల్లలు. ఈ ఇద్దరు కూడా మృతి చెందడంతో వారు అనాధలుగా మిగిలారు.

Also Read: ప్రవళిక ఆత్మహత్య కేసులో కీలక పరిణామం..నిందితుడికి బెయిల్‌..!!

భార్గవి మృతి చెందడంతో కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు తల్లిదండ్రులు తిరుమలరావు, మాధవి. భార్గవి పెళ్లి ఘనంగా చేయాలని భావించిన తల్లిదండ్రులు.. కూతురి మృతితో శోకసంద్రంలో మునిగారు. దుఖంలో ఉన్న భార్గవి తల్లిదండ్రులను అంత్యక్రియల్లో పాల్గొని ఓదార్చి వారికి అండగా నిలిచాడు పెళ్లి కొడుకు మహేష్.

Advertisment
తాజా కథనాలు