YCP: టీడీపీ, జనసేనకు బిగ్ షాక్ .. వైసీపీలోకి పలువురు కీలక నేతలు టీడీపీ, జనసేనకు బిగ్ షాక్ తగిలింది. పలువురు కీలక నేతలు వైసీపీలో చేరారు. సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో విజయవాడ, విశాఖపట్నంకు చెందిన పలువురు టీడీపీ మాజీ కార్పొరేటర్లు, సీనియర్ నేతలు, జనసేన నాయకులు అధికార పార్టీ గూటికి చేరుకున్నారు. By Jyoshna Sappogula 26 Mar 2024 in ఆంధ్రప్రదేశ్ నెల్లూరు New Update షేర్ చేయండి YCP: ఏపీలో ఎన్నికల వేళ టీడీపీ , జనసేనకు బిగ్ షాక్ తగిలింది. సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు విజయవాడకు చెందిన పలువురు టీడీపీ మాజీ కార్పొరేటర్లు, జనసేన నాయకులు. గండూరి మహేష్, నందెపు జగదీష్ (మాజీ కార్పొరేటర్లు), కొక్కిలిగడ్డ దేవమణి (మాజీ కోఆప్షన్ మెంబర్), కోసూరు సుబ్రహ్మణ్యం (మణి) టీడీపీ రాష్ట్ర బీసీ సెల్ సెక్రటరీ, గోరంట్ల శ్రీనివాసరావు, మాజీ డివిజన్ అధ్యక్షులు, బత్తిన రాము (జనసేన విజయవాడ తూర్పు నియోజకవర్గం ఇంఛార్జి) అధికార పార్టీ గూటికి చేరుకున్నారు. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో విశాఖపట్నంకు చెందిన పలువురు సీనియర్ నాయకులు కూడా అధికార పార్టీ గూటికి చేరుకున్నారు. జి.వి.రవిరాజు (సీనియర్ నాయకులు), బొగ్గు శ్రీనివాస్, బొడ్డేటి అనురాధ (జనసేన నాయకులు). ఈ కార్యక్రమంలో వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ వైవీ. సుబ్బారెడ్డి, గాజువాక వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్ధి గుడివాడ అమర్నాథ్, విశాఖ నార్త్ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్ధి కే.కే. రాజు పాల్గొన్నారు. ఈ నేపథ్యంలోనే ఏలూరు ఎంపీ టికెట్ ఆశించి భంగపడ్డ గోరుముచ్చు గోపాల్ యాదవ్, మాజీ ఎమ్మెల్యే చిన్నం రామకోటయ్య, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి మస్తాన్ యాదవ్ సీఎం జగన్ సమక్షంలో అధికార పార్టీ గూటికి చేరుకున్నారు. సూళ్ళూరుపేట టీడీపీ సీనియర్ నేత వేనాటి రామచంద్రారెడ్డి సైతం వైసీపీలో చేరారు. ఈ కార్యక్రమంలో వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ పి.వి.మిథున్రెడ్డి, సూళ్ళూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య, వెంకటగిరి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్ధి నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి, నెల్లూరు డీసీసీబీ ఛైర్మన్ కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డి పాల్గొన్నారు. #tdp-janasena మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి