ప్రియురాలిని కుక్కర్‌తో కొట్టి చంపిన కిరాతకుడు అరెస్ట్

మొన్న ఢిల్లీలో శ్రద్దా వాకర్.. నిన్న ముంబయిలో సరస్వతి వైద్య.. నేడు బెంగళూరులో మరో అమ్మాయి. అసలేం జరుగుతోంది.. లివింగ్ టుగెదర్ పేరుతో కోరిక తీర్చుకోవడం.. ఆపై చంపేయడం. రోజురోజుకు ఇలాంటి దారుణాలు పెరిగిపోతున్నాయి.

ప్రియురాలిని కుక్కర్‌తో కొట్టి చంపిన కిరాతకుడు అరెస్ట్
New Update

మొన్న ఢిల్లీలో శ్రద్దా వాకర్.. నిన్న ముంబయిలో సరస్వతి వైద్య.. నేడు బెంగళూరులో మరో అమ్మాయి. అసలేం జరుగుతోంది.. లివింగ్ టుగెదర్ పేరుతో కోరిక తీర్చుకోవడం.. ఆపై చంపేయడం. రోజురోజుకు ఇలాంటి దారుణాలు పెరిగిపోతున్నాయి. అనుమానం పెను భూతంలా మారి ప్రాణాలు తీయిస్తోంది. తాజాగా బెంగళూరులో జరిగిన ఓ హత్య.. శ్రద్దా వాకర్‌ను గుర్తుచేస్తోంది.

లివింగ్ పార్టనర్‌పై అనుమానంతో... కుక్కర్‌తో అతి కిరాతకంగా కొట్టి చంపిన ఘటన బెంగళూరులో జరిగింది. కేరళ తిరువనంతపురంకి చెందిన 24 ఏళ్ల దేవి.. కొల్లంకి చెందిన వైష్ణవ్ ఇద్దరు ప్రేమించుకున్నారు. దీంతో ఇద్దరు లివింగ్ రిలేషన్‌లో ఉంటున్నారు. గత రెండేళ్లుగా బెంగళూరులోని మయో లేఅవుట్‌లో అద్దెకు ఉంటున్నారు. అయితే గత కొంతకాలంగా దేవి తనని మోసం చేస్తుందని అనుమానించిన వైష్ణవ్.. తరచూ ఆమెతో గొడవ పడుతున్నాడు. తాజాగా ఆదివారం మరోసారి గొడవ జరగడంతో.. కోపంతో ఊగిపోయిన వైష్ణవ్.. ప్రెజర్ కుక్కర్‌తో దారుణంగా కొట్టి చంపాడు. దీంతో ఆమె అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయింది. స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నారు.

వీరిద్దరూ ఒకే కాలేజీలో చదవడమే గాక.. సేల్స్ అండ్ మార్కెటింగ్ సెక్టార్‌లో పని చేస్తున్నారు. అయితే కొంతకాలంగా వీరిద్దరి మధ్య గొడవలు జరుగుతూనే ఉన్నాయని చుట్టుపక్కల వాళ్ళు చెబుతున్నారు. కానీ దీనిపై ఎలాంటి కంప్లైంట్ రాలేదని పోలీసులు వెల్లడించారు. హత్య చేశాక వైష్ణవ్ పరారీలో ఉండగా.. పోలీసులు అతడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

#NULL
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి