Supreme Court: కేజ్రీవాల్‌ బెయిల్‌ పై నేడు సుప్రీం తీర్పు!

ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ కు ఎక్సైజ్‌ పాలసీ కేసులో బెయిల్‌, సీబీఐ అరెస్ట్‌ ను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ల పై సుప్రీం కోర్టు తీర్పును ఇవ్వనుంది. ఇప్పటికే రెండు సార్లు బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేయగా అవి సుప్రీంకోర్టులో విచారణలో ఉన్నాయి.

New Update
supreme

Supreme Court: ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ కు ఎక్సైజ్‌ పాలసీ కేసులో బెయిల్‌, సీబీఐ అరెస్ట్‌ ను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ల పై సుప్రీం కోర్టు తీర్పును ఇవ్వనుంది. జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఉజ్జల్ భుయాన్‌లతో కూడిన ధర్మాసనం సెప్టెంబర్ 5న తన నిర్ణయాన్ని రిజర్వ్ చేసిన సంగతి తెలిసిందే. విచారణలో సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ కేజ్రీవాల్ తరఫు వాదనలు వినిపించారు. 

బెయిల్ పిటిషన్‌పై విచారణ సందర్భంగా కేజ్రీవాల్ తరపు న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ వాదిస్తూ ‘ఎక్సైజ్ పాలసీ కేసులో సీబీఐ నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌లో కేజ్రీవాల్ పేరు అయితే చేర్చలేదు. కేజ్రీవాల్‌ను బెయిల్‌పై విడుదల చేయాలని రెండుసార్లు సుప్రీంకోర్టు, ఒకసారి ట్రయల్ కోర్టు ఆదేశించాయని సింఘ్వీ వివరించారు.

కేజ్రీవాల్ రెండు వేర్వేరు పిటిషన్లను దాఖలు చేశారు. అవి సుప్రీంకోర్టులో విచారణలో ఉన్నాయి. సీబీఐ తన అరెస్టును సవాల్ చేస్తూ కేజ్రీవాల్ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. రెండో పిటిషన్‌లో కేజ్రీవాల్ బెయిల్ కోసం అప్పీల్ చేసుకున్నారు. అంతకుముందు ఆగస్టు 5న ఢిల్లీ హైకోర్టు కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించింది. ట్రయల్ కోర్టుకు వెళ్లాలని కోరింది. కేజ్రీవాల్ బెయిల్‌ను హైకోర్టు వ్యతిరేకించగా, బెయిల్‌పై బయటకు వచ్చిన తర్వాత కేజ్రీవాల్‌ సాక్షులను ప్రభావితం చేయవచ్చని సీబీఐ తన వాదనలో ధర్మాసనానికి వినిపించింది. కేజ్రీవాల్‌ పిటిషన్లపై ధర్మాసనం సెప్టెంబర్ 5న తీర్పును రిజర్వ్‌లో ఉంచిన సంగతి తెలిసిందే.

ఈ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్‌ను జూన్ 26న సీబీఐ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ అవినీతి కేసులో తన అరెస్టును హైకోర్టు సమర్థిస్తూ ఢిల్లీ హైకోర్టు ఆగస్టు 5న ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కేజ్రీవాల్‌ను సీబీఐ అరెస్టు చేసిన తర్వాత ఆయనకు వ్యతిరేకంగా తగిన సాక్ష్యాలు ఉన్నాయని హైకోర్టు వివరించింది.

సంబంధిత సాక్ష్యాలను చూస్తే కారణం లేకుండా లేదా చట్టవిరుద్ధమైన అరెస్టు అని చెప్పలేమని కోర్టు పేర్కొంది. ఆయన బెయిల్ పిటిషన్‌పై కింది కోర్టును ఆశ్రయించేందుకు కూడా హైకోర్టు అనుమతించింది. ఈ కేసు ఢిల్లీ ప్రభుత్వం ఎక్సైజ్ పాలసీ 2021-22 రూప కల్పన, అమలులో అవినీతికి సంబంధించినది. తర్వాత ఈ విధానం రద్దు చేసింది. ఆరోపించిన ఎక్సైజ్ పాలసీ ‘స్కామ్’కు సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ మనీలాండరింగ్‌పై ప్రత్యేక కేసు నమోదు చేసింది.

ఎక్సైజ్ పాలసీని సవరిస్తూ అక్రమాలకు పాల్పడ్డారని, లైసెన్సుదారులకు అనుచిత ప్రయోజనాలు కల్పించారని సీబీఐ, ఈడీ పేర్కొన్నాయి. మనీలాండరింగ్ కేసులో కేజ్రీవాల్‌కు జులై 12న సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చింది. మనీలాండరింగ్ చట్టం కింద “అవసరం, నిర్బంధం” అనే అంశంపై మూడు ప్రశ్నల సందర్భంలో లోతైన పరిశీలన కోసం ఉన్నత న్యాయస్థానం దానిని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం కి సిఫార్సు కి పంపింది. ఈ క్రమంలోనే కేజ్రీవాల్‌ కి బెయిల్‌ వస్తుందా..రాదా అనేది తెలియాలంటే మాత్రం సుప్రీం తీర్పు ఇచ్చేంత వరకు ఆగాల్సిందే.

Advertisment
తాజా కథనాలు