/rtv/media/post_attachments/wp-content/uploads/2023/06/kedarnath-yatra-stopped-3.jpg)
కేదార్ నాథ్ యాత్ర....ఈ యాత్రకు దేశం నలుమూల నుంచే కాకుండా ఇతర దేశాల నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తుంటారు. ప్రతిఏటా కేదార్ నాథ్ యాత్రను దర్శించుకునేందుకు భక్తులు ఎంతో ఉత్సాహంతో ఎదురుచూస్తుంటారు. ఈ ఏడాది కూడా కేదార్ నాథ్ యాత్ర ఈ మధ్యే ప్రారంభమైంది.
అయితే అక్కడ నెలకొన్న వాతావరణ పరిస్థితుల ద్రుష్ట్యా సీఎం పుష్కర్ సింగ్ దామీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం అక్కడ భారీ వర్షాలు కురుస్తుండటంతో ఈ యాత్రను ప్రస్తుతం తాత్కాలికంగా నిలిపివేశారు. రాబోయే మూడు రోజుల పాటు భారీవర్షాలు కురుస్తాయని వాతావరణ అధికారులు హెచ్చరించడంతో సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది. మళ్లీ ఉత్తర్వులు జారీ చేసేంతవరకు యాత్రకు వచ్చేవారిని ఎవర్నీ కూడా అనుమతించకూడదని పుష్కర్ సింగ్ ధామీ ఆదేశాలు జారీ చేశారు.
కాగా ఇప్పటికే యాత్రకు బయలుదేరిని యాత్రికులను సోన్ ప్రయాగ ప్రాంతం వద్ద అధికారులు అడ్డుకున్నారు. వారు అక్కడే ఉండేందుకు తాత్కాలిక ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ మయూర్ దీక్షిత్ తెలిపారు. కేవలం కేదార్ నాథ్, రుద్రప్రయాగ ప్రాంతంలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతోపాటు వరదలు వచ్చే ప్రమాదం కూడా ఉన్నట్లు అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. దీంతో రెస్క్యూటీం, పోలీసులు వర్షాలు పడే ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలంటూ సీఎం పుష్కర్ సింగ్ ధామీ ఆదేశించారు.