అది జరిగితే కేసీఆర్, కేటీఆర్, కవిత జైలుకే... RS ప్రవీణ్ సంచలన వ్యాఖ్యలు

తెలంగాణ రాష్ట్ర బీఎస్పీ పార్టీ అధ్యక్షుడు ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు భద్రత తగ్గించి తెలంగాణ ప్రభుత్వం మానసికంగా ఇబ్బంది పెడుతుందని అన్నారు. బీఎస్పీ అధికారంలోకి వచ్చిన వెంటనే కేసీఆర్, కేటీఆర్, కవిత, హరీష్ రావులను జైలుకు పంపుతామని అన్నారు.

New Update
అది జరిగితే కేసీఆర్, కేటీఆర్, కవిత జైలుకే... RS ప్రవీణ్ సంచలన వ్యాఖ్యలు

RS Praveen Kumar: ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణ రాష్ట్ర బహుజన్ సమాజ్ పార్టీ అధ్యక్షుడు ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ ఆర్టీవికి ఇచ్చిన ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు ప్రభుత్వం భద్రత తగ్గించి మానసికంగా ఇబ్బంది పెడుతుందని ఆరోపించారు. తనకు భద్రత పెంచాలని తెలంగాణ డీజీపీని కోరుతున్నట్లు తెలిపారు. మేడిగడ్డ, కాళేశ్వరం.. మిగతా ప్రాజెక్టులలో కల్వకుంట కుటుంబం 30 నుంచి 40వేల కోట్ల కమిషన్ తిన్నారని ఆరోపించారు. తెలంగాణలో బీఎస్పీ పార్టీకి అధికారంలోకి వచ్చిన వెంటనే సీఎం కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవితలను జైలుకు పంపిస్తామని అన్నారు. లిక్కర్ స్కాం కేసులో బీజేపీ పార్టీ ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాను జైలుకు పంపారు.. మరి ఇదే స్కాంలో డబ్బులిచ్చిన కవితను ఎందుకు అరెస్ట్ చేయడం లేదని ప్రశ్నించారు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు ఒకటే అనే దానికి ఇది నిదర్శనం అని అన్నారు. ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ పూర్తి ఇంటర్వ్యూని ఈ వీడియోలో చూడండి.

Advertisment
తాజా కథనాలు