Gutta Sukhender Reddy:కేసీఆర్ మూడోసారి ముఖ్యమంత్రి కావడం ఖాయం: గుత్తా సుఖేందర్ రెడ్డి

శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం కేసీఆర్ మూడోసారి ముఖ్యమంత్రి కావడం ఖాయమన్నారు. ఇక అభ్యర్థులను మార్చినా మార్చకున్నా.. పార్టీని గెలిపించుకోవాల్సిన అవసరం పార్టీలోని అందరి పై ఉందన్నారు గుత్తా సుఖేందర్ రెడ్డి...

Gutta Sukhender Reddy:కేసీఆర్ మూడోసారి ముఖ్యమంత్రి కావడం ఖాయం: గుత్తా సుఖేందర్ రెడ్డి
New Update

Gutta Sukhender Reddy: శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం కేసీఆర్ మూడోసారి ముఖ్యమంత్రి కావడం ఖాయమన్నారు. ఇక అభ్యర్థులను మార్చినా మార్చకున్నా.. పార్టీని గెలిపించుకోవాల్సిన అవసరం పార్టీలోని అందరి పై ఉందన్నారు గుత్తా సుఖేందర్ రెడ్డి.

టికెట్ దక్కిన వారు అసమ్మతి లేకుండా అందరినీ కలుపుకు పోవాల్సిన బాధ్యత ఉందన్నారు.ఇక కాంగ్రెస్ పార్టీ డిక్లరేషన్స్ అన్నీ సాధ్యమైనవి కావని పేర్కొన్నారు ఆయన. అయితే నేటి రాజకీయాల్లో ఓర్పు చాలా అవసరమని కాని ప్రస్తుతం నాయకుల్లో ఓపికలు తగ్గాయన్నారు గుత్తా.

గ్రూపులు కట్టడం, అసాంఘిక శక్తులకు నేను దూరంగా ఉంటానన్నారు. పాముకు పాలు పోసి పెంచొద్దని అని అభిప్రాయపడ్డారు. రాజకీయాల్లో కులాలకు, మతాలకు ప్రాధాన్యత ఉండదన్నారు. ప్రజలతో మమేకమైన వారికే నేతలకే ఆదరణ దక్కుతుందని గుత్తా సుఖేందర్ రెడ్డి అభిప్రాయపడ్డారు.

ఇది కూడా చదవండి: కాంగ్రెస్ లో డబుల్ ట్రబుల్..వారసులకు టికెట్ కోసం జోరుగా సీనియర్ల లాబీయింగ్..!!

#NULL
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి