గుండె బరువెక్కింది..తెలంగాణ ఉద్యమ గొంతుక సాయిచంద్ మరణం తర్వాత ఆయన భార్య రజని ఏడ్చిన తీరు ప్రతీ ఒక్కరి హృదయాలను కన్నీరుపెట్టించగా..తాజాగా సాయిచంద్ భార్యను ఓదార్చడానికి వెళ్లిన కేసీఆర్ కూతురు, ఎమ్మెల్సీ కవిత తీవ్ర ఉద్వేగానికి లోనయ్యారు. రజనిని హత్తుకొని కవిత ఏడ్చేశారు. రజని, కవిత ఇద్దరూ సాయిచంద్ జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ కన్నీటి పర్యంతమయ్యారు. ఈ దృశ్యాలను అక్కడే ఉండి చూసిన వాళ్లు కళ్లు చమర్చాయి. సాయిచంద్ మరణం తర్వాత సరిగ్గా తినక ఇటివలే ఆస్పత్రిపాలైన రజనిని ఓదార్చడానికి వచ్చిన కవిత కన్నీళ్లు ఆపుకోలేకపోయారు. కేసీఆర్, హరీశ్రావుకు అత్యంత ఆప్తుడు సాయిచంద్. బీఆర్ఎస్ ఏ సభ నిర్వహించినా అందులో ఎంతో ఉత్సాహంగా ఆడి, పాడే సాయిచంద్ కళ్ల ముందు లేడన్న బాధ సామాన్యుల నుంచి రాజకీయ నాయకులు వరకు ప్రతిఒక్కరి హృదయాలను మెలిపెడుతోంది.
పూర్తిగా చదవండి..Video: చూస్తే కన్నీళ్లు ఆగవు.. సాయిచంద్ భార్యను హత్తుకొని ఏడ్చేసిన కవిత
ఇటీవల గుండెపోటుతో మృతి చెందిన గాయకుడు సాయిచంద్ కుటుంబసభ్యులను సీఎం కేసీఆర్ కూతురు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పరామర్శించారు. ఈ క్రమంలో ఆమె భావోద్వేగానికి గురై కంటతడి పెట్టుకున్నారు. సాయిచంద్ చిన్నవయసులోనే వెళ్లిపోయాడని రోదిస్తున్న ఆయన భార్య రజనీని కవిత హత్తుకొని ఓదార్చే ప్రయత్నంలో ఏడుపును ఆపుకోలేకపోయారు.
Translate this News: