2019లో టీఎస్ఆర్టీసీ చేపట్టిన సమ్మె దేశవ్యాప్తంగా చాలా రోజులు టాప్ హెడ్లైన్స్లో నిలుస్తూ వచ్చింది. ప్రభుత్వాన్ని ఎదురిస్తూ.. తమ డిమాండ్లు నెరవేర్చాలని.. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని పిల్లాపాపలతో..నడిరోడ్డుపై యావత్ తెలంగాణ ఆర్టీసీ కార్మిక లోకం నిరసనలకు దిగడం రాష్ట్రాన్ని స్తంభింప చేసింది. ప్రజలను ఆలోచింపచేసింది. ఆర్టీసీ కార్మికుల కష్టాలను కళ్లకు కట్టినట్టు చూపించిన సమ్మె అది. ఈ నిరసనల తర్వాత ప్రస్తుత ఆర్టీసీ జేఏసీ ఛైర్మన్ అశ్వద్ధామరెడ్డి(ashwathama reddy) పేరు మారుమోగినా.. ఈ ఉద్యమాన్ని వెనుక నుంచి నడిపించింది..లీడ్ చేసింది.. దశా దిశా నిర్దేశించిన వ్యక్తి తెలంగాణ మజ్దూర్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి థామస్రెడ్డి(thomas reddy). ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసిన తర్వాత ఆయన ఆర్టీవీకి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇదే క్రమంలో పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
పూర్తిగా చదవండి..అశ్వద్ధామరెడ్డి వల్లే ఇంత ఆలస్యం.. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనంపై థామస్రెడ్డి ఏమన్నారంటే..?
ఆర్టీసీ జేఏసీ ఛైర్మన్ అశ్వద్ధామరెడ్డి మూర్ఖత్వం వల్లే ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం ఆలస్యమైందంటూ విమర్శలు గుప్పించారు తెలంగాణ మజ్దూర్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి థామస్రెడ్డి. ఆర్టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో థామస్రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ తాజా నిర్ణయం వల్ల ఆర్టీసీ కార్మికులకు ఎంతో మేలు జరుగుతుందన్నారు థామస్రెడ్డి.
Translate this News: