/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/YCP-jpg.webp)
కర్నూలు జిల్లా ఆలూరులో వైసీపీకి భారీ షాక్ తగిలింది. ఆ పార్టీ జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు కప్పట్రాళ్ల బొజ్జమ్మ పార్టీని వీడారు. ఆమె టీడీపీలో చేరనున్నారు. దేవనకొండ, ఆస్పరి మండలాల్లో కప్పట్రాళ్ల బొజ్జమ్మకు బలమైన కేడర్ ఉంది. దీంతో ఆమె చేరిక జిల్లా రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. ఈ రోజు బొజ్జమ్మ హైదరాబాద్ లో చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరనున్నారు. బొజ్జమ్మతో పాటు ఆమె భర్త రామచంద్రనాయుడు సైతం టీడీపీలో చేరుతున్నారు. అయితే.. ఏడాది కిందటే టీడీపీ నుంచి వైసీపీలోకి బొజ్జమ్మ చేరారు. కప్పట్రాళ్ల బొజ్జమ్మ పార్టీని వీడుతుండడంతో వైసీపీ నష్టనివారణ చర్యలు ప్రారంభించింది. ఎక్కువ మంది నేతలు ఆమె వెంట వెళ్లకుండా ముఖ్య నాయకులు చర్చలు జరుపుతున్నారు.