Bhuma Akhila Priya: టార్గెట్ ఏవీ సుబ్బారెడ్డి.. అఖిలప్రియ అనుచరుల రాళ్ల దాడి!

కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో మరోసారి ఫ్యాక్షన్ విభేదాలు భగ్గుమన్నాయి. ఏవీ సుబ్బారెడ్డికి చెందిన ఏవీ ప్లాజాపై భూమా అఖిలప్రియ అనుచరులు రాళ్లదాడికి దిగడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ రాళ్లదాడిలో బార్ అండ్ రెస్టారెంట్ అద్దాలు పగిలిపోయాయి.

New Update
Bhuma Akhila Priya: టార్గెట్ ఏవీ సుబ్బారెడ్డి.. అఖిలప్రియ అనుచరుల రాళ్ల దాడి!

ఆళ్లగడ్డలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. మరోసారి భూమా అఖిల ప్రియ, ఏవీ సుబ్బారెడ్డికి మధ్య విభేదాలు మరోసారి బయటపడ్డాయి. ఏవీ సుబ్బారెడ్డికి చెందిన ఏవీ ప్లాజాపై భూమా అఖిలప్రియ అనుచరులు రాళ్ల దాడికి దిగడంతో పట్టణంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ రోజు భూమా ఘాట్ నుండి ఎమ్మెల్యే అఖిలప్రియ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్బంగా ఏవీ ప్లాజాలోని బార్ అండ్ రెస్టారెంట్ మరియు రిలయన్స్ మార్ట్‌పై భూమా అఖిలప్రియ అనుచరులు రాళ్ల దాడికి దిగారు. ఈ రాళ్ల దాడిలో బార్ అండ్ రెస్టారెంట్ అద్దాలు పగిలిపోయాయి.

భూమా అఖిలప్రియ తండ్రి నాగిరెడ్డి మరణం తర్వాత భూమా ఫ్యామిలీ, ఏవీ సుబ్బారెడ్డి కుటుంబాల మధ్య విభేదాలు ప్రారంభమైన విషయం తెలిసిందే. ఇరు వర్గాల మధ్య అనేక సార్లు దాడులు, ప్రతిదాడులు చోటు చేసుకున్నాయి. ఇటీవల ఎన్నికలు ముగిసిన తర్వాత అఖిలప్రియ బాడీగార్డును కారుతో గుద్ది హత్య చేసేందుకు ప్రయత్నం జరిగింది. ఈ ఘటన సంచలనంగా మారింది. ఈ ఘటనకు సంబంధించి ఏవీ సుబ్బారెడ్డితో పాటు మరో ఐదుగురిపై కేసు నమోదైంది. ఈ క్రమంలో ఏవీ ప్లాజాపై అఖిలప్రియ అనుచరులు దాడికి దిగడం సంచలనంగా మారింది.

Advertisment
తాజా కథనాలు