ఏం తినాలన్నా భయమేస్తోంది.. ఏది తిన్నా క్యాన్సర్ అంటున్నారు.. ఏ పదార్థం గురించి తనిఖీ చేసినా క్యాన్సర్ కారకాలు ఉన్నాయంటున్నారు. ఈ కెమికల్స్, రసాయానాల సంగతి అటు ఉంచితే హోటల్, రెస్టారెంట్ నుంచి ఏం కొనాలన్నా చెమటలు పడుతున్నాయి. ఎందుకంటే చికెన్ బిర్యానీ ఆర్డర్ చేస్తే అందులో బొద్దింకలను కలిపి కీటకాల బిర్యానీ అందిస్తున్నారు. నల్లీ బిర్యానీ ఆర్డర్ చేస్తే బల్లి బిర్యానీ ఇస్తున్నారు. సరే ఈ బిర్యానీలన్ని కాస్త ఖర్చుతో కూడుకున్నవి.. డబ్బులు ఉంటే కొనుకొవచ్చు లేదంటే లేదు.. అయితే పేద, మద్యతరగతి నుంచి ధనికులు వరకు ఎక్కువగా కుమ్మేసే పానీపూరీలను కూడా తినలేని దుస్థితి దాపరించడం దుర్మార్గం. సామాన్యులకు అత్యంత ఇష్టమైన పానీపూరీలోనూ క్యాన్సర్ కారకాలు ఉండడం బాధాకరం!
పూర్తిగా చదవండి..Panipuri: పానీపూరీ తింటే క్యాన్సర్ ఖాయం.. కర్ణాటక సర్కార్ కీలక నిర్ణయం!
పానీపూరీ సాస్, స్వీట్ చిల్లీ పౌడర్లో క్యాన్సర్ కారక రసాయనాలు ఉన్నట్లు కర్ణాటక అధికారులు గుర్తించారు. దీంతో సీరియస్ అయిన సిద్ధరామయ్య సర్కార్.. ఆయా పదార్థాలను నిషేధించడానికి సిద్ధమవుతోంది.
Translate this News: