Telangana: బీజేపీకి షాక్.. ఆ బంధం చూసి ఉండలేనంటూ పార్టీకి రాజీనామా చేసిన కీలక నేత..

Telangana BJP: మృత్యుంజయం కరీంనగర్ జిల్లాలో సీనియర్ పొలిటికల్ లీడర్. ఆయన గతంలో జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ అధ్యక్షుడిగా కూడా చేశారు. కరీంనగర్ మాజీ శాసనసభ్యులు కూడా. నాటి బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రోద్బలంతో 2019లో మృత్యుంజయం కాంగ్రెస్ పార్టీని వీడి బిజెపిలో చేరారు.

New Update
Telangana: బీజేపీకి షాక్.. ఆ బంధం చూసి ఉండలేనంటూ పార్టీకి రాజీనామా చేసిన కీలక నేత..

Telangana BJP:రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా తెలంగాణలో అధికారంలోకి రావాలనుకుంటున్న బీజేపీకి.. వరుస షాక్‌లు ఎదురవుతున్నాయి. తాజాగా సీనియర్ నేత మృత్యుంజయం బీజేపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. తన రాజీనామా లేఖను రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు జి. కిషన్ రెడ్డికి పంపించారు. ఇక లేఖలో తన రాజీనామాకు కారణంగా సంచలన ఆరోపణలు చేశారు మృత్యుంజయం. రాష్ట్రంలో బీజేపీ, బీఆర్ఎస్ మధ్య సంబంధాలు చూశాక ఇకపై పార్టీలో కొనసాగలేకపోతున్నానని తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు.

మృత్యుంజయం కరీంనగర్ జిల్లాలో సీనియర్ పొలిటికల్ లీడర్. ఆయన గతంలో జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ అధ్యక్షుడిగా కూడా చేశారు. కరీంనగర్ మాజీ శాసనసభ్యులు కూడా. నాటి బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రోద్బలంతో 2019లో మృత్యుంజయం కాంగ్రెస్ పార్టీని వీడి బిజెపిలో చేరారు. అయితే, ఇటీవలి కాలంలో పార్టీలో చోటు చేసుకుంటున్న పరిణామాలతో ఆయన కలత చెందారట. ఈ మేరకు రాజీనామా లేఖలో తన రాజీనామాకు గల కారణాలన్నింటినీ వివరించారు మృత్యంజయం. ‘రాష్ట్ర నెలకొన్న రాజకీయ పరిస్థితులు, బిజెపి, అధికార బీఆర్ఎస్ పార్టీ మధ్య సంబంధాలు నిశితంగా పరిశీలించిన మీదట, ఇకపై పార్టీలో కొనసాగలేనని నమ్ముతూ బిజెపి నుండి వైదలుగుతున్నాను’ అంటూ తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు మృత్యుంజయం.

సుదీర్ఘకాలం కాంగ్రెస్ పార్టీలో కొనసాగి ఉమ్మడి కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షునిగా జిల్లాలో పార్టీని పటిష్ట పరిచిన మృత్యుంజయం ఆ పార్టీకి చెందిన జిల్లా నేతలతో పొసగక 2019లో బిజెపిలో చేరారు. అయితే, పార్టీలో ఎలాంటి హోదా లభించకున్నప్పటికీ వివిధ ఎన్నికల్లో పార్టీ ఆదేశం మేరకు అభ్యర్థుల విజయం కోసం ఆయన కృషి చేశారు. తమిళనాడు శాసనసభ ఎన్నికల సందర్భంగా తిరువన్నామలై నియోజకవర్గ ఇన్చార్జిగా ఆయన బాధ్యతలు నిర్వహించారు. హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సందర్భంగా ఖైరతాబాద్ నియోజకవర్గ ఇన్చార్జ్ గా ఆయన పనిచేశారు. వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సందర్భంగా కొన్ని డివిజన్లకు ఆయన ఇంచార్జ్ గా వ్యవహరించారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంలో నాగర్ కర్నూల్ నియోజకవర్గ ఇన్చార్జిగా ఆయన పనిచేశారు. మునుగోడు ఉప ఎన్నికల్లో కూడా కొన్ని మండలాల ఇన్చార్జిగా ఆయన విధులు నిర్వహించారు.

Also Read:

Shah Rukh Khan: బాక్సాఫీస్ బాద్షాగా రికార్డు సృష్టించిన షారుఖ్‌ ఖాన్

World Bank: భారత్ డిజిటల్ వ్యవస్థ అద్భుతం.. ప్రపంచ బ్యాంక్ కితాబు

Advertisment
తాజా కథనాలు