YCP MLA Manugunta: టీడీపీలోకి కందుకూరు MLA మానుగుంట?

ఏపీలో అధికార పార్టీకి మరో షాక్ తగలనున్నట్లు తెలుస్తోంది. కందుకూరు వైసీపీ MLA మానుగుంట మహిధర్ రెడ్డి టీడీపీ గూటికి వెళ్లనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో, వైసీపీ పెద్దలు మానుగుంటను బుజ్జగించే ప్రయత్నం చేపట్టారు.

New Update
YCP MLA Manugunta: టీడీపీలోకి కందుకూరు MLA మానుగుంట?

MLA Manugunta Mahidhar Reddy: ఏపీలో నెల్లూరు రాజకీయాలు హాట్ హాట్ గా కొనసాగుతున్నాయి.  ఒంగోలు నగరంలో జరిగిన సిద్ధం పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమానికి కందుకూరు MLA మానుగుంట మహిధర్ రెడ్డి డుమ్మా కొట్టారు. దీంతో ఆయన పార్టీ మారుతున్నట్లు పెద్ద ఎత్తున వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మహీధర్ రెడ్డిని  నెల్లూరు వైసీపీ ఎంపీ అభ్యర్థి విజయసాయి రెడ్డి కలిసినట్లు తెలుస్తోంది.

Also Read: కొత్త పెళ్లి కూతుర్లూ.. ఇది మీ కోసమే.. అత్తమామలను ఫ్లాట్‌ చేసే చిట్కాలు!

అయితే, ఇప్పటికే పార్టీ మార్పు విషయంలో కందుకూరు YCP MLA మానుగుంట మహిధర్ రెడ్డి ఒక నిర్ణయానికి వచ్చారని ప్రచారం జరుగుతోంది. పలు దఫాలుగా అభిమానులతో పార్టీ మార్పుపై చర్చించినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా, వైసీపీ నుంచి టీడీపీకి చేరిన కీలక నేత, రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కూడా ఇప్పటికే మానుగుంట మహిధర్ రెడ్డిని ఒకసారి టీడీపీ లోకి ఆహ్వానించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

Also Read: సూర్యప్రకాశ్ కు కందుల దుర్గేష్ వార్నింగ్.. జనసేన గురించి తప్పుగా మాట్లాడితే…

YCP పార్టీ కార్యాలయానికి మానుగుంట మహిధర్ రెడ్డి తాళం వేసి వెళ్లిపోవ్వడంతో వైసీపీ పెద్దలు ఆయన ఇంటికి వెళ్లారు.  బుర్ర, బీదా మస్తాన్ రావు, విజయ్ సాయి రెడ్డి, మంత్రి కాకాని, ఆదాల ప్రభాకర్ రెడ్డి మానుగుంటను బుజ్జగించే ప్రయత్నంలో ఉన్నట్లు అర్థమవుతోంది. విజయసాయి రెడ్డి మాటలకు మానుగుంట కన్విన్స్ అవుతారా? లేదంటే టీడీపీలోకి మారుతారా? అనే ఆసక్తి నెలకొంది.

Advertisment
తాజా కథనాలు