కేసీఆర్, కేటీఆర్ కాళ్ల బేరానికి వచ్చారు..కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు.!

30 సీట్ల కోసం 1500 కోట్లకు పవన్ అమ్ముడుపోయాడని సంచలన వ్యాఖ్యలు చేశారు KA పాల్. ఈ సందర్భంగానే కేసీఆర్, కేటీఆర్ పై ఫైర్ అయ్యారు. తనను మరోసారి గెలిపించాలని తండ్రికొడుకులు తన కాళ్ల బేరానికి వచ్చారని అన్నారు.

కేసీఆర్, కేటీఆర్ కాళ్ల బేరానికి వచ్చారు..కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు.!
New Update

KA Paul: విజయవాడ బందరు రోడ్డులో వంగవీటి రంగా విగ్రహానికి నివాళులు అర్పించారు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్(KA Paul). ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. వంగవీటి రంగా(vangaveeti ranga) ఆత్మ క్షోభిస్తుందని అని సంచలన వ్యాఖ్యలు చేశారు. రంగా గురించి ఆలోచించిన కాపులెవ్వరూ టీడీపీ(TDP)లో చేరరని అన్నారు. ఈ నేపథ్యంలోనే కేసీఆర్, కేటీఆర్ పై ఫైర్ అయ్యారు. తనను మరోసారి గెలిపించాలని తండ్రి, కొడుకులు తన కాళ్ల బేరానికి వచ్చారని అన్నారు.

Also Read: వైసిపి ఎమ్మెల్యే పై టిడిపి ఇంచార్జ్ షాకింగ్ కామెంట్స్.!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్(Janasena pawan kalyan)పై విమర్శలు గుప్పించారు. ప్యాకేజి స్టార్ పవన్ కళ్యాణ్‌కు 1000 కోట్లు ఇచ్చారని..అందుకే, కాపులను టీడీపీకి అమ్మేశారని కామెంట్స్ చేశారు. 2009 లో అన్న చిరంజీవి(chiranjevi), ఇప్పుడు తమ్ముడు పవన్ కళ్యాణ్ ఈ ఇద్దరూ కూడా కాపులను అమ్మేశారని వ్యాఖ్యనించారు.

Also Read: ఓట్లు చీలనివ్వను అని పవన్ కళ్యాణ్ అనడానికి రీజన్ ఇదే..!

రాజ్యాధికారం కోసం కాపులంతా తరలి రావాలని పిలుపునిచ్చారు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు KA పాల్. 29 శాతం ఉన్న కాపులకు అధికారం రావాలన్నారు. ప్యాకేజి తీసుకునే పవన్ కళ్యాణ్ వెనుక ఉంటారా? లేదా నాతో ఉంటారా? అనేది కాపులు తెలుసుకోవాలని అన్నారు. 30 సీట్లకు 1500 కోట్లకు పవన్ అమ్ముడుపోయాడని కేఏ పాల్ ఆరోపించారు. గుండు గీయించుకున్న కాపులు కావాలా..?గుండు గీసే కాపులు కావాలా? మీరే నిర్ణయించుకోండని అన్నారు. మీ నాన్నను చంపిన వారితో ఉంటారా? లేదా నాతో ఉంటారో వంగవీటి రాధా(vangaveeti radha) తేల్చుకోవాలని అన్నారు.

#NULL
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe