AP: పగలు పాఠాలు.. చీకటి పడితే చిందులు.. ఆ కాలేజీలో నిత్యం జరిగే తంతు ఇదే..! ప్రకాశం జిల్లా మర్రిపూడి జూనియర్ కళాశాల మందుబాబులకు అడ్డాగా మారింది. కళాశాల సమీపంలోనే బార్షాపు ఉండటంతో మందుబాబులు చీకటి పడితే కళాశాల ఆవరణంలో చిందులు వేస్తుంటారు. దీంతో విద్యార్థులు హడలిపోతున్నారు. ఈ విషయంపై అధికారులు స్పందించాలని గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. By Jyoshna Sappogula 10 Aug 2024 in ఆంధ్రప్రదేశ్ ఒంగోలు New Update షేర్ చేయండి Prakasam: ప్రకాశం జిల్లా మర్రిపూడి జూనియర్ కళాశాల మందుబాబులకు అడ్డాగా మారింది. ఈ కళాశాలలో పగలు పాఠాలు వినిపిస్తుంటాయి.. కానీ, చీకటి పడితే మాత్రం మందుబాబుల లొల్లి వినిపిస్తుంటుంది. కళాశాల ఆవరణ నిత్యం మందు సీసాలతో నిండిపోతోందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జూనియర్ కళాశాల సమీపంలోనే మందుషాపు ఉండటంతో మందుబాబుల ఆగడాలకు అడ్డు అదుపులేకుండా పోతుందని స్థానికులు చెబుతున్నారు. Also Read: నాకు న్యాయం చేయండి.. ప్రియుడి కోసం ప్రియురాలి పోరాటం..! దీంతో స్టూడెంట్స్ కాలేజీకి వెళ్లాలంటేనే భయపడుతున్న పరిస్థితి నెలకొంది. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు సైతం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు ఈ విషయంపై స్పందించాలని గ్రామస్తులు వేడుకుంటున్నారు. కళాశాల సమీపంలో ఉంటున్న మందుషాపును తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. Also Read: గ్యాంగ్ సినిమా తరహాలో ఫుడ్ ఇన్ స్పెక్టర్లమంటూ రైడ్.. చివరికి ఏం జరిగిందంటే? #prakasam #ap-news మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి