హర్యానాలో కురుస్తున్న భారీ వర్షాలకు పలు చోట్ల నదుల కరకట్టలు తెంచుకుని ఉధృతంగా ప్రవహిస్తుంటే మరోవైపు వరదల కారణంగా ప్రజల సహనం కూడా నశిస్తోంది. ఈనేపథ్యంలో ఓ షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. కైతాల్ జిల్లాలోని భాటియా గ్రామంలో వరదలతో ఇబ్బందులు పడుతున్న గ్రామస్థులను పరామర్శించేందుకు గుహ్లా JJP ఎమ్మెల్యే ఈశ్వర్ సింగ్ వెళ్లారు. ఘగ్గర్ నది ఉప్పెంగి ప్రవహిస్తోంది. దీంతో చాలా గ్రామాలు ముంపునకు గురయ్యాయి. ఈ సమయంలోనే ఎమ్మెల్యే అక్కడ పర్యటించడంతో తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కోవలసి వచ్చింది.
పూర్తిగా చదవండి..ఎమ్మెల్యే చెంపపగలకొట్టిన మహిళ…వైరల్ వీడియో..!!
వరద ప్రభావిత ప్రాంతాన్ని పరిశీలించేందుకు వెళ్లిన జేజేపీ ఎమ్మెల్యే ఈశ్వర్ సింగ్ పై మహిళ దాడి చేసింది. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది. వరద బాధితులను పరామర్శించేందుకు వచ్చిన జననాయక్ జనతా పార్టీ ఎమ్మెల్యే ఈశ్వర్ సింగ్ ను ఆ మహిళ చెప్పుతో కొట్టింది. ఈ ఘటన జరిగినప్పుడు ఎమ్మెల్యే ఈశ్వర్ సింగ్ కైతాల్ లోని గుహ్లా ప్రాంతంలో వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శించారు.
Translate this News: