అది జయశంకర్ భూపాలపల్లి జిల్లా (Jayashankar Bhupalpally).. గణపురం మండలం.. మోరంచపల్లి గ్రామం ((moranchapalli village).. రాత్రి 12దాటింది.. అంతా నిద్రిస్తున్నారు.. ఇంతలోనే కాళ్లకి నీరు తగిలినట్టు అనిపించింది. లేచి చూస్తే ఇళ్లంతా నీటిమయం.. ఇంటి డోర్ల స్పెస్లో నుంచి వరద దూసుకొస్తోంది. ఏం జరుగుతుందో అర్థమయ్యేలోపే ఇల్లు మొత్తం నీటిమయమైపోయింది. ఇంటిలోని సామాన్లు, ఇతర వస్తువులు, వంట గిన్నెలు ప్రతీ వస్తువూ నీటిలో తేలియాడుతుంటే బాధిత కుటుంబాలు విలవిలలాడాయి. తన్నుకొస్తున్న దుఃఖాన్ని ఆపుకుంటూ ముందు ప్రాణాలు కాపాడుకునేందుకు ఇంటి నుంచి బయటపడ్డారే కానీ.. కష్టపడి కొనుక్కున్న వస్తువులు నీటిపాలు కావడం వాళ్లని తీవ్రంగా కలిచివేసింది.
పూర్తిగా చదవండి..ఎవర్ని పలకరించినా కన్నీళ్లే..మోరంచపల్లి విలవిల
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కురిసిన జడివానతో మోరంచపల్లి గ్రామం అతలాకుతలమైంది. గ్రామ శివారులోకి వరద వచ్చి చేరడంతో ఇళ్లన్ని నీట మునిగాయి.ఒకప్పుడు కళకళలాడిన తమ ఇంటిని.. విధ్వంసం తర్వాత కనిపిస్తున్న తమ ఇంటిని చూసుకుంటూ బాధితులు కన్నీరుమున్నీరవుతున్నారు.
Translate this News: