/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/jsp-11-jpg.webp)
Janasena Leaders Protest: పశ్చిమ గోదావరి తణుకు ప్రజాగళం సభలో విడివాడ రామచంద్రరావు అనుచరులు ఆందోళన చేపట్టారు. నియోజకవర్గ జనసేన ఇంఛార్జ్ విడివాడ రామచంద్రరావుకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని ప్లకార్డులు ప్రదర్శించారు. గెలిచే సీటును ఎందుకూ టీడీపీకి కట్టబెట్టారని నిరసన చేశారు. వారాహీ యాత్రలో ఇచ్చిన మాటకు విలువ ఏది? సమాధానం ఏది? అని పవన్ ను ప్రశ్నిస్తూ ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసనకు దిగారు. విడివాడ జనసేన అనుచరులను టీడీపీ నాయకులు అడ్డుకున్నారు.