Janasena: సూర్య ప్రకాష్ కు జనసైనికుల వార్నింగ్.!

వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సూర్య ప్రకాష్ కు జనసైనికులు వార్నింగ్ ఇచ్చారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ఇష్టం వచ్చినట్టు వాగితే సహించేది లేదని హెచ్చరించారు.ఆచంట నియోజకవర్గంలో విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్న మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.

New Update
Janasena: సూర్య ప్రకాష్ కు జనసైనికుల వార్నింగ్.!

Janasena Leaders Fired On Surya Prakash: పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గంలో జనసేన నాయకులు విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు హాజరైయ్యారు. అయితే, ఈ సమావేశం రస బసగా మారింది. జిల్లా అధ్యక్షుడు కోటికలపూడి గోవిందరావు, చేగొండి సూర్య ప్రకాష్ వల్లే నియోజకవర్గంలో పార్టీ నాశనం అయ్యిందంటూ పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.

Also Read:  రైతులకు జగన్‌ అదిరిపోయే గిఫ్ట్‌.. ఇవాళ అన్నదాతల ఖాతాలలో డబ్బులు జమ!

మరికొందరూ.. పార్టీలో కష్టపడి పనిచేస్తుంటే ప్రతిఫలం దక్కడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సూర్య ప్రకాష్ మండల కమిటీలను ఇంట్లో కూర్చుని వేశాడని సుబ్బారాయుడు ముందు వాపోయారు జనసేన (Janasena) నాయకులు. జనసేన ముసుగులో ఇంకా నియోజకవర్గంలో సూర్య ప్రకాష్ కోవర్టులు వున్నారని .. వాళ్ళు ముసుగు తీసి వైసీపీకి పోవాలని పేర్కొన్నారు.

Also Read: ఉదయ్ కిరణ్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. ఆ సూపర్ హిట్ మూవీ రీ రిలీజ్

ఈ సందర్భంగా సూర్య ప్రకాష్ పై సుబ్బారాయుడు ఫైర్ అయ్యారు. సూర్య ప్రకాష్ పార్టీ నుండి వెళ్లినందుకు బాధ లేదని..కానీ, దేవుడు లాంటి పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) పై నిందలు వేస్తున్నాడని ధ్వజమెత్తారు. జనసేనానిపై ఇష్టం వచ్చినట్టు వాగితే సహించేది లేదని తేల్చిచెబుతున్నారు. పిచ్చి పిచ్చిగా మాట్లాడితే ఖబడ్దార్ ..అంటూ సూర్య ప్రకాష్ కు వార్నింగ్ ఇచ్చారు. ఎవడు వెళ్ళిన చెక్కు చెదరని పార్టీ జనసేన పార్టీ అని కామెంట్స్ చేశారు.

Advertisment
తాజా కథనాలు