Adinarayana: జగన్, భారతికి అన్ని ముందే తెలుసు.. ఆదినారాయణ సంచలన వ్యాఖ్యలు..!

వైఎస్ వివేకా హత్య కేసులో జగన్, భారతికి అన్ని ముందే తెలుసున్నారు జమ్మలమడుగు బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదినారాయణ రెడ్డి. ఈ క్రమంలోనే ఎమ్మెల్యే సుధీర్ రెడ్డికి మాస్ వార్నింగ్ ఇచ్చారు. మాట అదుపులో పెట్టుకోవాలని..అతిగా మాట్లాడితే చెప్పు తెగుతుందని హెచ్చరించారు.

New Update
Adinarayana: జగన్, భారతికి అన్ని ముందే తెలుసు.. ఆదినారాయణ సంచలన వ్యాఖ్యలు..!

Adinarayana Reddy: కడప జిల్లా జమ్మలమడుగు పార్టీ కార్యాలయంలో బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదినారాయణ రెడ్డి సీఎం జగన్, భారతిపై సంచలన వాఖ్యలు చేశారు. జగన్ రెడ్డి చేసేదే మోసం.. చెప్పేవన్నీ కట్టు కథలేనని మండిపడ్డారు. వైఎస్ వివేకా హత్య కేసులో జగన్, భారతికి ముందే అన్ని విషయాలు తెలుసున్నారు. సీబీఐ వద్ద అన్ని రికార్డులు వున్నాయని కామెంట్స్ చేశారు.

Also Read: సీఎం జగన్ బస్సు యాత్రకు బ్రేక్..!

కేంద్ర నిధులన్నీ మింగుతున్నారని ఆరోపించారు. ఏ పల్లెలో ఏయే సహజ వనరులున్నాయో తెలుసుకోవడానికే ఎమ్మెల్యే గ్రామాల్లో తిరుగుతున్నాడని దుయ్యబట్టారు. ఎమ్మెల్యే దనదాహానికి అంతు లేదన్నారు. జమ్మలమడుగు నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభివృద్ధి చేయలేదని..ఇసుక నీళ్లు అమ్ముకొని బతుకుతున్న వ్యక్తి ఎమ్మెల్యే సుధీర్ అని మండిపడ్డారు.

Also Read: నా ఫోన్‌లను బీఆర్‌ఎస్ ట్యాప్ చేసింది.. బలమైన ఆధారాలున్నాయి!

ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మాట అదుపులో పెట్టుకోవాలని.. అతిగా మాట్లాడితే చెప్పు తెగుతుందని వార్నింగ్ ఇచ్చారు. కూటమితోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమన్నారు. తాను సూపర్ డూపర్ గా గెలువబోతున్నట్లు సర్వేలు చెపుతున్నాయని ధీమా వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే సుధీర్ ఈ ఎన్నికల్లో చిత్తు చిత్తుగా ఓడిపోతారని జోస్యం చెప్పారు. వివేకా కేసులో కోటిలో ఒక పాయింట్ తన పాత్ర ఉంటే ఉరి వేయండని.. దానికి తాను రెడీ అంటూ పేర్కొన్నారు. మీ పాత్ర ఉంటే మీరు రెడీనా అని జగన్ కు సవాల్ విసిరారు.

Advertisment
తాజా కథనాలు