/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/jammalamadugu-mla-adi-narayana-reddy.jpg)
మంత్రి పదవి కోసం తాను ప్రయత్నం చేయడం లేదని బీజేపీ జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి స్పష్టం చేశారు. ఈ రోజు కూటమి ఎమ్మెల్యేల సమావేశానికి హాజరైన సందర్భంగా ఆర్టీవీతో ఆయన ప్రత్యేకంగా మాట్లాడారు. బీజేపీ నుంచి మంత్రి పదవులు ఎవరికి దక్కుతాయనే విషయం హైకమాండ్ చేతుల్లో ఉంటుందన్నారు. అన్ని వర్గాల వారిని జగన్ దెబ్బకొట్టడంతో ఆయను వారంతా దెబ్బ కొట్టారన్నారు. తాము ధర్మంగా పని చేస్తామన్నారు. అమరావతి, పోలవరం, రైల్వే జోను, వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీ అన్నింటినీ పూర్తి చేయాల్సిన బాధ్యత తమపై ఉంటుందన్నారు. ఆదినారాయణ రెడ్డి పూర్తి ఇంటర్వ్యూను ఈ వీడియోలో చూడండి.