IT Employees: టీడీపీ చీఫ్ చంద్రబాబును ప్రభుత్వం అక్రమంగా అరెస్ట్ చేసిందంటూ కొన్ని రోజులుగా టీడీపీ శ్రేణులు ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. ఏపీతో పాటు తెలంగాణలోనూ నిరసనలు వ్యక్తమవుతున్నాయి. హైదరాబాద్లోని ఐటీ కారిడార్లో సాఫ్ట్వేర్ ఉద్యోగులు రెండు రోజులుగా ఆందోళన చేస్తున్నారు. ఐ యామ్ విత్ సీబీఎన్ అంటూ ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసనకు దిగారు. అయితే ఈ సందర్భంగా ర్యాలీలకు అనుమతి లేదంటూ పోలీసులు కొంతమంది ఉద్యోగులపై లాఠీ ఛార్జీ వేసిన విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. పోలీసుల తీరుపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఐటీ ఉద్యోగులకు పోలీసులు షాక్ ఇచ్చారు. చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ చేపడుతున్న ఆందోళనపై పోలీసులు ఆంక్షలు విధించారు. మాదాపూర్, గచ్చిబౌలి, మణికొండ, నానక్ రాంగూడ, తదితర ప్రాంతాల్లో ఆంక్షలు అమల్లో ఉంటాయని తెలిపారు.
పూర్తిగా చదవండి..IT Employees: హైదరాబాద్లో ఐటీ ఉద్యోగులకు పోలీసుల షాక్
టీడీపీ చీఫ్ చంద్రబాబును ప్రభుత్వం అక్రమంగా అరెస్ట్ చేసిందంటూ కొన్ని రోజులుగా టీడీపీ శ్రేణులు ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. ఏపీతో పాటు తెలంగాణలోనూ నిరసనలు వ్యక్తమవుతున్నాయి. హైదరాబాద్లోని ఐటీ కారిడార్లో సాఫ్ట్వేర్ ఉద్యోగులు రెండు రోజులుగా ఆందోళన చేస్తున్నారు. ఐ యామ్ విత్ సీబీఎన్ అంటూ ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసనకు దిగారు
Translate this News: